పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు.
ఏడాదికి రూ.1.30 లక్షల నష్టం.. నిర్వాసితుడి ఆవేదన
కొండ ఇచ్చారని చూపిస్తున్న శివకృష్ణ
పోలవరం, న్యూస్టుడే: ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. నిర్వాసిత రైతులను వెంటబెట్టుకు వెళ్లి భూములు చూపించి వారి అంగీకారంతోనే వాటిని సేకరించి గిరిజనులకు సాగు పట్టాలు అందజేశారు. పునరావాస కాలనీ పూర్తికాకపోవడం, పాత గ్రామం నుంచి కాలనీకి దూరం కావడంతో అక్కడకు నిత్యం వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేక అధికారులు ఎవరి దగ్గర నుంచి భూములు కొనుగోలు చేశారో వారికే కౌలుకు ఇచ్చారు పోలవరం మండలంలో మొదటి దశలో ఖాళీ చేసిన ఏడు గ్రామాల్లో ఒకటైన చేగొండపల్లి గిరిజనులు. అందులో కొందరికి కొండ ఇచ్చిన విషయం పునరావాస కాలనీకి తరలివెళ్లిన తరువాత నిర్వాసితులకు తెలిసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరిగిన తండ్రి మరణంతో కోర్టును ఆశ్రయించాడు నిర్వాసితుడు ముచ్చిక శివకృష్ణ.
2010లో భూసేకరణ
2010లో ఆనాటి జిల్లా కలెక్టర్ చేగొండపల్లి నిర్వాసితుల కోసం ప్రగడపల్లి పంచాయతీ పరిధిలోని 39 రైతులకు సంబంధించి 173.41 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వారి నుంచి ఆ భూములు సేకరించి 2011లో 38 మంది గిరిజన రైతులకు వాటిని అందజేశారు. అందులో ముచ్చిక వెంకటేశ్వరరావుకు ఆరు ఎకరాలు, బాల మురళీకృష్ణకు 8 సెంట్లు అందజేశారు. అప్పటికి భూములు సేకరించిన ప్రాంతంలో పునరావాస కాలనీ పూర్తి కాకపోవడంతో పాత గ్రామం నుంచి అంత దూరం వెళ్లి వ్యవసాయం చేయలేక ప్రభుత్వం ఎవరి వద్ద భూములు కొనుగోలు చేసిందో ఆ రైతులకే గిరిజనులకు కౌలుకు ఇచ్చారు. 2016లో ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావడంతో పాత గ్రామం నుంచి గిరిజన నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. ముచ్చిక వెంకటేశ్వరరావు, బాల మురళీకృష్ణలకు అప్పుడు తెలిసింది తమకు కేటాయించింది కొండ అని.. దాంతో అధికారుల వద్దకు పరుగులు దీశారు.
తండ్రి మరణంతో..
తండ్రి వెంకటేశ్వరరావు 2017లో మరణించడంతో కుమారుడు ముచ్చిక శివకృష్ణ భూముల కోసం కార్యాలయాలు చుట్టు తిరుగుతూ మంచి భూమి ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు. పోలవరం తహసీల్దార్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో, ఐటీడీఏ పీవో, ఏలూరు కలెక్టర్ వరకు వెళ్లి ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించక తప్పలేదన్నాడు.
రెండో దశలో వారిదీ అదే పరిస్థితి
ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండో దశలో ఖాళీ చేసిన 19 గ్రామాల్లో ములగలగూడెం ఒకటి. గ్రామంలోని 15 మంది రైతుల కోసం 34 ఎకరాలు బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం సమీపంలో సేకరించారు. ఇప్పటివరకు తమకు ఆ భూములు అందజేయలేదు. కొనుగోలు చేసిన రైతులకు పరిహారం ప్రభుత్వం చెల్లించకపోవడంతో గ్రామం నుంచి బయటకు వచ్చిన తమ పరిస్థితి దయనీయంగా మారిందని మిడియం వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?