ఉప కారాగారంలో రిమాండు ఖైదీ మృతి
మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి.
ఎస్ఐ కొట్టడంతోనే చనిపోయాడని ఆందోళన
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే : మద్యం కేసులో అరెస్టు అయిన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67) వ్యవసాయ కూలి. ఇతను మద్యం విక్రయాలు చేస్తున్నాడని ఈ నెల 16వ తేదీ పెద్దపంజాణి పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేయగా మదనపల్లె సబ్జైలుకు పంపారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో మొగిలప్ప సబ్జైలులోనే కుప్పకూలిపోయాడు. దీంతో మదనపల్లె సబ్జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ యాదవ్, సిబ్బంది ఆయన్ను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను పెద్దపంజాణి ఎస్ఐ శ్రీనివాసులు కొట్టాడని భార్య రెడ్డెమ్మ ఆరోపించారు. ఆ దెబ్బలు తాళలేకే మరణించారని రోదిస్తూ చెప్పారు. సోమవారం సాయంత్రం స్టేషన్కు తీసుకెళ్లారని, తాము ఎలాంటి మద్యం వ్యాపారాలు చేయకున్నా ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తే సమాధానం కూడా చెప్పలేదని ఆమె తెలిపారు. స్టేషన్కు వెళితే అప్పటికే తన భర్తను తీవ్రంగా కొట్టారని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తీసుకెళ్లి మంగళవారం ఉదయాన్నే స్టేషన్కు తీసుకు రావాలని చెప్పారన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో స్టేషన్కు వెళితే ఆలస్యంగా వచ్చారని మళ్లీ కొట్టారని ఆమె అన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గంజాయి కేసు పెడుతానని ఎస్ఐ బెదిరించినట్లు చెప్పారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన
మొగిలప్ప కుటుంబానికి న్యాయం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకుడు యామలా సుదర్శనం, గుండా మనోహర్, మోహన్, సంఘం నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పెద్దపంజాణి ఎస్ఐపై, మొగిలప్పకు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడిపై, మదనపల్లె సబ్జైలు సూపరింటెండెంట్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 3 గంటల పాటు బంధువులకు మృతదేహాన్ని చూపించకుండా నిర్లక్ష్యం చేసిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ వల్లిబసు, రెండో పట్టణ ఎస్ఐ వెంకట సుబ్బయ్యలు ఆసుపత్రి వద్దకు చేరుకుని వారికి సర్ధి చెప్పారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్, తహసీల్దార్ రమాదేవి తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకుని మొగిలప్ప శరీరంపై గాయాలు ఉన్నాయా? అని పరిశీలించారు. మొగిలప్ప మృతిపై పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలాపురంలో యువకుడి దారుణ హత్య
[ 30-04-2024]
పట్టణంలోని పకీర్ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్ ఘనీ (26)గా గుర్తించారు. -
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
[ 30-04-2024]
ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించిందో కొడుకు, కూతురితో కలిసి చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించింది. ‘అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. -
జగన్ అరాచక కేళి.. జనం కావాలా బలి..!
[ 30-04-2024]
అబద్ధాలు వల్లె వేయడం, కుయుక్తులు పన్నడం, అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపాది అందె వేసిన చేయి. దేన్నీ వదిలిపెట్టకుండా రాజకీయంగా మలుచుకోవడానికి కాచుకు కూర్చున్న వైకాపా సర్కారు ప్రజల ప్రాణాలతో మరోసారి ఆటలాడుకుంటోంది. -
జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?
[ 30-04-2024]
జగన్ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
నామపత్రాల ఉప సంహరణలు
[ 30-04-2024]
ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. -
వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం
[ 30-04-2024]
రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. -
ట్రయల్రన్ పేరుతో పట్టణం దిగ్బంధం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి మంగళవారం మైదుకూరు పర్యటనతో సోమవారం సాయంత్రం పోలీసులు ట్రయల్రన్ నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్లను దిగ్బంధనం చేశారు. లోపలి వాహనాలను బయటకు పంపండం తప్పితే పట్టణంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
ప్రచారం... చేరికలు
[ 30-04-2024]
పురపాలకలోని చిన్నయ్యగారిపల్లెలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేశారు. మైదుకూరు పురపాలకకు చెందిన ఆరీఫ్, రెహ్మాన్, అస్యాక్, షేక్ ఆరీఫ్, చందు, అబ్దుల్లా, బాషా, హుస్సేన్, అబ్దుల్, బ్రహ్మంగారిమఠం జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన వైకాపా నాయకులు నాగులారపు కొమ్మయ్య, బత్తల శివ, సంసోను, ఫిలమెంట్, దినకర్, భాస్కర్, ఏసోబు, డేవిడ్ తెదేపాలో చేరారు. -
సీఎం పర్యటనతో విభాజికం ధ్వంసం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి. ఇది ఒక్ల మైదుకూరు పట్టణంలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ ప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్థితి. -
రోడ్డుపైనే సీఎం సభ... ప్రయాణాలు మానుకోండి!
[ 30-04-2024]
ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల వైపు నుంచి మైదుకూరు మీదుగా బద్వేలు, కడప మార్గంలో మంగళవారం రాకపోకలు సాగించే ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభను మైదుకూరు వద్ద కృష్ణపట్నం-హుబ్లీ జాతీయ రహదారిపై నిర్వహించనున్నారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
[ 30-04-2024]
రాజంపేట ఎంపీ స్థానంతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. రాజంపేట ఎంపీ స్థానంలో 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 18 మంది బరిలో నిలిచారు. -
కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం
[ 30-04-2024]
వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
[ 30-04-2024]
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. -
బంగ్లామిట్ట... తాగునీటికి కటకట!
[ 30-04-2024]
రైల్వేకోడూరు మండలం బొజ్జావారిపల్లె పంచాయతీ బంగ్లామిట్ట కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్ పంపింగ్ మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. -
వైకాపాకు యువజన రాష్ట్ర కార్యదర్శి రాజీనామా
[ 30-04-2024]
మైదుకూరుకు చెందిన వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు సోమవారం విలేకరులకు తెలిపారు. -
నేడు కలికిరికి సీఎం జగన్ రాక
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కలికిరికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలికిరి-కలకడ మార్గంలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న స్థలాన్ని హెలీప్యాడ్కు పరిశీలించి చదును చేశారు.