డ్రైవింగ్ శిక్షణ.. దక్కని ఆదరణ
టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు పలు రంగాల వైపు అడుగులు వేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. హెవీ మోటారు వాహనాల చోదక శిక్షణ ఇచ్చి ఆదాయం పొందాలనుకున్నా యువత నుంచి ఆదరణ కరవైంది.
ఆర్టీసీ కేంద్రాల్లో చేరేందుకు ముందుకు రాని యువత
టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు పలు రంగాల వైపు అడుగులు వేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. హెవీ మోటారు వాహనాల చోదక శిక్షణ ఇచ్చి ఆదాయం పొందాలనుకున్నా యువత నుంచి ఆదరణ కరవైంది. ఫలితంగా శిక్షణ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
టీఎస్ ఆర్టీసీ తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేయగా కరీంనగర్ రీజియన్లో కరీంనగర్తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో 2021లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ స్కూళ్లల్లో చేరిన వారికి 30 రోజులు శిక్షణ ఇస్తారు. ఐదు రోజులు థియరీ, 25 రోజులు ప్రాక్టికల్ ఉంటుంది. ఇందులో 16 గంటలకు తగ్గకుండా స్టీరింగ్పై తర్ఫీదు ఇస్తారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా స్థానిక రహదారిని ఎంచుకొని బస్సును నడపడం, నియంత్రించడం, బ్రేక్, క్లచ్ ఎలా ఉపయోగించాలి, వాహనం ఎలా రిపేరు చేయాలి, రోడ్డు నిబంధనలు, సిగ్నల్స్, యూటర్న్, పార్కింగ్, ఓవర్టేక్ ఎలా చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. సాధారణ అభ్యర్థులకు రూ.15,600, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఫీజు రూపేణా చెల్లించాల్సి ఉంటుంది.
104 మందికి...
కరీంనగర్ రెండో డిపో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్లో జనవరి 2021 నుంచి ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్ల్లో 104 మంది మాత్రమే శిక్షణ పొందారు. జగిత్యాల జిల్లాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా కాలం డ్రైవింగ్ స్కూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. రీజియన్ మొత్తంలో అభ్యర్థులు లేక డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు వెలవెల బోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఉండటంతో యువత అందులోనే చేరుతున్నారు.ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ స్కూల్కు అంతగా ఆదరణ లేదని అంటున్నారు.
సంక్షేమ శాఖలపైనే...
డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను విజయవంతంగా కొనసాగించేందుకు ఆర్టీసీ ప్రభుత్వ సంస్థల చేయూత కోసం ఎదురుచూస్తోంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ శాఖలపై భారీగా ఆశలు పెట్టుకుంది. పలు జిల్లాల్లో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఆయా శాఖల అధికారులను కలిసి విన్నవించారు. ఆయా సంక్షేమ శాఖల నుంచి శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులను ఎంపిక చేసి పంపిస్తే శిక్షణ ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీకి అన్ని విధాలా శిక్షణకు సంబంధించిన వనరులు అందుబాటులో ఉంటాయి. అనుభవజ్ఞులైన డ్రైవర్లు, వాహనం రిపేరు, ఇలా ప్రతి అంశానికి సంబంధించిన వారు ఉంటారు. హెవీ మోటారు డ్రైవింగ్ శిక్షణ కాకుండా కారు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే వందలాది మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
కారణాలు ఇలా..
* ఫీజు అధికంగా ఉండటం (రూ.15,600). ఇది పేద, మధ్యతరగతి యువతకు ఆర్థిక భారంగా మారింది.
* ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం.
* ఎక్కువ మంది కారు డ్రైవింగ్ శిక్షణ వైపు మొగ్గు చూపుతున్నారు.
* శిక్షణపై ప్రచారం లేక పోవడం, ప్రైవేట్ కేంద్రాల్లో ఫీజు తక్కువగా ఉండటం.
సిద్ధంగా ఉన్నాం -వి.మల్లయ్య, డీఎం, కరీంనగర్-2 డిపో
అభ్యర్థులు వస్తే శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సంక్షేమ శాఖల అధికారులను కలిశాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. శిక్షణ తీసుకునే వారిని ఎంపిక చేసి అందుకు సంబంధించిన రుసుం చెల్లిస్తే సంస్థ పరంగా శిక్షణ ఇస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు
[ 20-05-2024]
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి లక్ష తులసి అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి