సంక్షిప్త వార్తలు
బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు
బలవంతంగా కెన్యాకు తరలిస్తున్నారంటూ ఫిర్యాదు
శంషాబాద్, న్యూస్టుడే: బలవంతంగా కెన్యా రాజధాని నైరోబీకి తీసుకెళుతున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు భద్రతాధికారులను ఆశ్రయించిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటు చేసుకుంది. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం..నేపాల్కు చెందిన తమాంగ్ను ఓ వ్యక్తి బలవంతంగా నైరోబీకి తరలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి వచ్చిన ఆమె భద్రతాధికారులను ఆశ్రయించింది. ఆమె ప్రవర్తనను గమనించిన సదరు వ్యక్తి పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్
ఖైరతాబాద్, న్యూస్టుడే: ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ టెండర్ ప్రక్రియలో టీఎస్09 ఎఫ్టీ 9999 నంబరును రూ.20.10లక్షలు చెల్లించి కీస్టోన్ ఇన్ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. కొత్త సిరీస్లో టీఎస్09 ఎఫ్యూ 0009 నంబరుకు ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ రూ.7.95 లక్షలు చెల్లించగా, 0001 నంబరును రాధికరెడ్డి పెరటి రూ.3.08లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. హైదరాబాద్ జిల్లా రవాణా శాఖకు రూ.46,14,824 ఆదాయం చేకూరిందని జేటీసీ పాండురంగ నాయక్ తెలిపారు.
తాగునీటి ట్యాంకులో కుళ్లిన మృతదేహం
రాంనగర్, న్యూస్టుడే: రాంనగర్ డివిజన్ ఎస్సార్కేనగర్ ప్రాంతంలోని జలమండలికి చెందిన 50 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం(25) ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జలమండలి సిబ్బంది ట్యాంకును శుభ్రం చేసేందుకు ఆరుగురు కూలీలను ట్యాంకుపైకి పంపించారు. కూలీలు ట్యాంకుపై ఉన్న మూతను తొలగించి లోపలికి దిగుతుండగా కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు భయంతో కిందికి వచ్చి విషయాన్ని సిబ్బందికి చెప్పారు. వెంటనే జలమండలి సిబ్బంది ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జహంగీర్యాదవ్, డీఐ వెంకన్న, సెక్టార్ ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని జీహెచ్ఎంసీ అత్యవసర విభాగం డీఆర్ఎఫ్ సహాయంతో సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని బయటకు తీశారు. సుమారు వారం, పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హత్య.. ఆత్మహత్య
వాటర్ ట్యాంకు లోపలికి వెళ్లడానికి రెండు ద్వారాలు ఉన్నాయి. వాటికి మూతలు వేసి ఉన్నాయని ట్యాంకును శుభ్రం చేయడానికి వెళ్లిన కూలీలు తెలిపారు. రెండు ద్వారాలకు మూతలు వేసి ఉండటంతో మృతుడితోపాటు మరొకరు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి ఉంటే మూతలు ఎలా పెట్టి ఉంటాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకుపై జత చెప్పులు ఉన్నాయి. కేసు దర్యాప్తులో అవి కీలకంగా మారనున్నాయని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెన్ శ్రీనివాస్, కార్పొరేటర్ రవిచారి, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మందుబాబులపై 65వేల కేసులు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, రాయదుర్గం: మోతాదు మించి మద్యం తాగుతూ వాహనాలు నడుపుతున్న వారిపై మూడు పోలీస్ కమిషనరేట్లలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నెలాఖరు వరకు 65 వేల కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 36 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రహదారి భద్రతపై మంగళవారం ట్రాఫిక్ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఎక్సైజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాదాపూర్ జోన్ పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు నమోదవుతున్నందున ఆ జోన్లో ప్రమాదాలు తగ్గించేందుకు దృష్టి కేంద్రీకరించాలన్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం లైసెన్సులు రద్దు చేయించేందుకు రవాణా శాఖ అధికారులో ఎప్పటికప్పుడు సంప్రదించాలని తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలతో పాటు, రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగింత
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: బాత్రూంలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్కు చెందిన మహిళ ఇంట్లో స్నానం చేస్తోంది. పక్కింటికి వచ్చిన ఇంటర్నెట్ కంపెనీ టెక్నీషియన్ ఆమెను చూసి బాత్రూం కిటికీనుంచి చరవాణిలో వీడియో తీయడం ప్రారంభించాడు. గమనించిన మహిళ వెంటనే కుమారుడికి తెలియజేయడంతో అతడు సదరు వ్యక్తిని పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి నిందితుడిని అదుపులోకి విచారించారు. మల్లేపల్లి ఇందిరానగర్కు చెందిన ఓ ఇంటర్నెట్ కంపెనీ టెక్నీషియన్ మార్టిన్(19)గా గుర్తించారు. బాధితురాలి భర్త పిర్యాదుతో కేసు నమోదుచేశారు.
‘లక్ష యువగళ గీతార్చన’ 14న
సుల్తాన్బజార్, న్యూస్టుడే: వైకుంఠ ఏకాదశి, గీతా జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న ఎల్బీస్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు తెలిపారు. మంగళవారం కోఠిలోని వీహెచ్పీ కార్యాలయంలో కార్యదర్శి బండారి రమేష్, గీతార్చన కార్యక్రమం కన్వీనర్ వెంకటేశ్వరరాజు, భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్చందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్గిరి, కార్యదర్శి చంపత్రాయ్, త్రిదండి చినజీయర్స్వామి, పెజావర్ మఠ్కు చెందిన విష్యప్రసన్న తీర్థ్ మహారాజ్, వీహెచ్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే హాజరవుతారన్నారు.
న్యాయవాదుల సారథి సునీల్గౌడ్
ఈనాడు, హైదరాబాద్: అఖిల భారత న్యాయవాదుల క్రికెట్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లాయర్ల సంఘం జట్టుకు సునీల్గౌడ్ సారథ్యం వహించనున్నాడు. ఈనెల 23 నుంచి 28 వరకు కటక్లో టోర్నీ జరుగుతుంది. జట్టు: సునీల్గౌడ్ (కెప్టెన్), రాజగోపాల్రెడ్డి, రఘువీరారెడ్డి, గోవింద్రెడ్డి, సయ్యద్ మన్సూర్, పవన్కుమార్ ఆదిత్య, సుమన్గౌడ్, సంచిత్ భంగ్, కహిలిద్ బిన్ సయీద్, ఉన్నం కృష్ణ, రాహుల్ తపాడియా, సాయిచంద్, అబ్దుల్ మతిన్ ఖురేషి, స్వామి, మనోహర్, హరిందర్, బాల గోపేందర్నాథ్ (మేనేజర్), ప్రవీణ్ (కోచ్).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు
[ 26-04-2024]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం