చూపులేనివారికి.. దారిచూపుతూ!
సాంకేతికత సహకారంతో చూపులేని వారికి దారి చూపుతూ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి పునరావాస సేవల కేంద్రం అండగా నిలుస్తోంది. పలు ఐటీ ఇతర సంస్థల సహకారంతో పునరావాస కేంద్రంలో అంధులకు శిక్షణ ఇవ్వడం...వారికి ఈ సేవల వినియోగం గురించి అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.
సాంకేతిక సహకారంతో అంధులకు అండ
ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుపత్రిలో ప్రదర్శన
ఈనాడు, హైదరాబాద్: సాంకేతికత సహకారంతో చూపులేని వారికి దారి చూపుతూ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి పునరావాస సేవల కేంద్రం అండగా నిలుస్తోంది. పలు ఐటీ ఇతర సంస్థల సహకారంతో పునరావాస కేంద్రంలో అంధులకు శిక్షణ ఇవ్వడం...వారికి ఈ సేవల వినియోగం గురించి అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. పూర్తిగా చూపులేని వారికే కాకుండా స్వల్ప దృష్టి మాంద్యం ఉన్నవారికి శిక్షణ ఇవ్వడం ద్వారా సాంఘిక, విద్యా, వృత్తిపర పునరావసం వరకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. కొన్ని పరికరాలను ఇక్కడే రూపకల్పన చేస్తున్నారు. వాటిని వాడటం నేర్పిస్తున్నారు. చూపులేదని కుంగిపోయి..ఆత్మవిశ్వాసం కోల్పోయి..ఎవరి మీదో ఆధారపడకుండా ఎవరి కాళ్లపై వారు మనగలిగేలా తీర్చిదిద్దుతున్నారు. నాణ్యమైన, స్వతంత్ర జీవితాన్ని గడపడానికి అవసరమైన సాంకేతికత సహకారం అందించడం ఈ పునరావాస సేవల కేంద్రం లక్ష్యం. గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే పురస్కరించుకొని గురువారం ఆసుపత్రిలో అంధులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు సందర్శకులు పరికరాలను ఆసక్తిగా పరిశీలించి...అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు. ఆ పరికరాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
దారి చూపే స్మార్ట్కేన్: అంధత్వం, దృష్టిలోపం ఉన్నవారు ఒక సన్నని పొడవాటి కర్ర లాంటి పరికరం(మొబిలీటీ కేన్) ఉపయోగించి నడుస్తుంటారు. రోడ్లు దాటుతుంటారు. అలాంటిదే ఈ స్మార్ట్కేన్. దీన్ని చేతిలో పట్టుకొని ముందుకు పోవడం...లేదంటే మొబిలిటీ కేన్కు బిగించి నడవటం ద్వారా దాన్నుంచి వచ్చే సిగ్నల్స్ ముందున్న వస్తువును 3 మీటర్ల ముందే గుర్తించి శబ్దంతో అప్రమత్తం చేస్తుంది.
బ్రెయిలీ టైప్ రైటర్: కంటిచూపు లేని వారు ఏదైనా చదవటానికి, రాయటానికి బ్రెయిలీ లిపి అందుబాటులో ఉంది. ఎల్వీపీలో దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బ్రెయిలీ లిపిలో సమాచారం క్రోడీకరించి అవి అంధులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. బ్రెయిలీలో లిపిని టైప్ రైటర్ ద్వారా నేర్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఆట వస్తువులు: అంధత్వం ఉన్న చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో సుడోకు, స్నేక్ అండ్ ల్యాడర్ లాంటి బుర్రకు పదును పెట్టే ఆటలను రూపొందించారు. బ్రెయిలీలో పేకముక్కలను తయారు చేశారు. బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా బొమ్మలపై బ్రెయిలీలో పేర్లు ఉంటాయి. ముట్టుకున్న వెంటనే ఆ బొమ్మపేరు ఏంటో తెలుస్తుంది. స్పర్శతో జంతువు ఎలాఉంటుందో తెలిసిపోతుంది.
యూ రీడ్ స్కానర్: ఈ స్కానర్ కింద ఏదైనా పుస్తకం లేదా పేపరు పెట్టినప్పుడు అందులో సమాచారం అంతా స్కాన్ చేసి వాయిస్ ఓవర్ ద్వారా విన్పిస్తుంది. వింటూ నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. పీడీఎఫ్ ఫైల్ను కూడా రూపొందిస్తుంది. ప్రస్తుతం ఆంగ్లంతోపాటు మిగతా భాషల్లోనూ ఇవి అందుబాటులోకి తేనున్నారు. దీనిని ఉపయోగించే తీరుపై ఇక్కడ తర్ఫీదు ఇవ్వనున్నారు.
అంధులకు ప్రత్యేకంగా... తక్కువ కంటిచూపు ఉన్నవారు కంప్యూటర్ను వినియోగించుకునేలా కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. జేఏడబ్ల్యూఎస్(జాస్) సాఫ్ట్వేర్ ద్వారా విండోస్లోని ఐకాన్లు పెద్దవిగా కనిపిస్తాయి. స్క్రీన్ రీడర్ సాయంతో వాటి గురించి తెలుసుకునే వీలు ఏర్పడుతుంది. తద్వారా సులువుగా కంప్యూటర్ను వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఆ యాప్.. అంధులకు కంటిచూపు!
యాప్ పనితీరును చూపుతున్న యువతి
ఈనాడు, హైదరాబాద్: అంధులు ఉపయోగించేందుకు వీలుగా...వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు ఇప్పటికే పలు యాప్లకు రూపకల్పన చేశాయి. మానవీయ కోణంలో ఆయా సంస్థలు ఉచితంగా వీటి సేవలను అందిస్తున్నాయి. ‘గూగుల్ లుక్ అవుట్’ ‘మనీ అప్లికేషన్’ ‘స్క్రీన్ రీడర్’ లాంటి యాప్లు ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించారు. ప్లేస్టోర్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్ఛు వీటికి భిన్నంగా తాజాగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ ఒక ప్రత్యేక యాప్ను తయారు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని ప్రాంతాల్లో అంధుల కోసం దీనిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. విజయవంతం కావడంతో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ సేవలు అందించడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. గురువారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఈ యాప్ సేవల గురించి వివరించారు.
* ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాప్తో ఎవరి సహాయం లేకుండానే అంధులు ఎక్కడైనా తిరిగే వీలు ఏర్పడనుంది.
* కార్యాలయంలో ఎక్కడ ఏ క్యాబిన్ ఉంది...మరుగుదొడ్లు ఎక్కడ ఉన్నాయి..మాల్స్లో ఏ షాపు ఎటు వైపు ఉంది...ఇలాంటి సమాచారం ఎవరో ఒకరు చెబితే తప్ఫ.సొంతంగా అంధులు గుర్తించలేరు. ఇలా సమయంలోనే ఈ యాప్ వారికి ఒక దారి చూపుతుంది. పలు ఇతర ఉపయోగాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.