ఎడాపెడా మోత..
నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.
యూజీడీ ఛార్జీల వసూలుకు సన్నాహాలు
ఇప్పటికే చెత్త సేకరణ రుసుములపై వ్యతిరేకత
న్యూస్టుడే, కార్పొరేషన్
చెత్తను సేకరిస్తున్న కార్మికులు
నగరంలో చెత్త సేకరణ రుసుముల వసూలు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు అన్న చందాన సాగుతోంది. మరో పక్క యూజీడీ ఛార్జీల విధింపునకు జీవీఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రుసుములపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆస్తి పన్నులో భాగంగా ఇవి వసూలు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఒక్కో ఇంటికి మురికివాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.120 వసూలు చేయాలని పాలకమండలి తీర్మానం చేసింది. అయితే ఇప్పటికీ ఏవి మురికివాడలనేది విభజించ లేదు.
త్వరలో యూజీడీ ఛార్జీల విధింపు: భూగర్భ మురుగునీటి వ్యవస్థ కనెక్షన్ల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని అధికారులు త్వరలో ఆయా ఛార్జీలు విధించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రారంభంలో ఒక్కో కనెక్షన్కు నెలకు రూ.40 విధించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇటీవల దాన్ని సవరించి రూ.50గా నిర్ధారించింది. ఇంట్లో రెండు మరుగుదొడ్లు ఉంటే ఒక్కో దానికి రూ.50 చొప్పున కట్టాల్సిందే..
* నగరంలో 84,368 యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో దానికి రెండు నుంచి 40 వరకు మరుగుదొడ్లు అనుసంధానించి ఉంటాయి. ప్రస్తుత కనెక్షన్లపై నెలకు మొత్తం రూ.4.5కోట్ల నిధులు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల అధికారులు లెక్క కట్టారు.
సర్దిచెప్పలేక సతమతం..
వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి, కార్పొరేటర్ల సహకారంతో చెత్త సేకరణ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో ప్రజలకు సర్ది చెప్పలేకపోతున్నామని అధికార వైకాపాకు చెందిన పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే భారాలు వేయడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు. సీపీఎం, సీపీఐ, తెదేపా, జనసేన, భాజపా కార్పొరేటర్లు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రెండున్నరేళ్లలో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించడానికి నిధులు వ్యయం చేయకుండా, ఇప్పుడు ప్రజల నుంచి చెత్త సేకరణ రుసుములు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కేవలం రూ.20లక్షలు వసూలు
నగరంలో 5,43,243 అసెస్మెంట్లు ఉన్నాయి. వాటిల్లో 1,80,928 అసెస్మెంట్లు మురికివాడల్లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. జీవీఎంసీ అధికారులు పకడ్బందీగా చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేయగలిగితే నెలకు రూ.5.43 కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. జీవీఎంసీ ఎంపిక చేసిన 8 వార్డుల నుంచి గతేడాది డిసెంబరులో కేవలం రూ.20లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు. వాణిజ్య సముదాయాలు, హోటళ్ల నుంచి వసూలు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా, ఇప్పటి వరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయలేదు. ఈ విధానాన్ని అన్ని వార్డుల్లో ఎప్పుడు అమలు చేస్తారో అధికారులు చెప్పలేకపోతున్నారు.
నూతన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసుల జారీ
మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్నులోకి మార్చిన అనంతరం పెరిగిన పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను జీవీఎంసీ రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. నగరంలోని 5,43,243 అసెస్మెంట్లలో 3,60,345 అసెస్మెంట్ల ఆస్తి పన్నులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త పన్నులు అమలులోకి వచ్చాయి. ఆయా నిధులు చెల్లించడానికి ఈ ఏడాది మార్చి వరకు గడువు ఉంది. ఇప్పటికే పన్నులు చెల్లించినవారు పెరిగిన 15శాతం నిధులు కట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు చెల్లించని వారు రెండు అర్ధ సంవత్సరాలకు చెల్లించాలి.
ఎక్కువ భారం పడకుండా..
యూజీడీ కనెక్షన్ల నుంచి వినియోగ రుసుములు వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. పదేళ్ల కిందట ఒక జీవో రాగా నాడు అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. నగర ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.
- కె.వి.ఎన్. రవి, మంచినీటి సరఫరా, యూజీడీ నిర్వహణ, పర్యవేక్షక ఇంజినీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’