ఎన్టీఆర్ జీవితచరిత్రను పాఠ్యాంశం చేస్తాం
నేటితరం విద్యార్థులకు తెలిసే విధంగా యుగపురుషుడు, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
మాట్లాడుతున్న అయ్యన్న, వేదికపై అనిత, పీలా, భరత్, చలపతిరావు, బుద్ధ, రామారావు తదితరులు
అనకాపల్లి, న్యూస్టుడే: నేటితరం విద్యార్థులకు తెలిసే విధంగా యుగపురుషుడు, దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెడతామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి జిల్లాస్థాయి ఉత్సవాలు గురువారం అనకాపల్లిలో నిర్వహించారు. ఇందులో అయ్యన్న మాట్లాడుతూ రాబోయేది తెదేపా ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చిన వెంటనే పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేర్చుతామని చెప్పారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే, మంత్రి అయిన ఘనత తనకు ఉందని... దీనికి కారణం ఎన్టీ రామారావేనని ఆయనతో కలిసి పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గతంలో కేంద్రమంత్రి, ముఖ్యమంత్రిని సైతం అరెస్టు చేసిన విషయం గుర్తు చేశారు. కానీ ఎంపీ అవినాష్రెడ్డిని అరెస్టు చేయనీయకుండా సీబీఐను అడ్డుకుంటోంది ఎవరో మోదీ, అమిత్షాలు సమాధానం చెప్పాలన్నారు. అవినాష్రెడ్డి అరెస్టు యత్నాలను వైకాపా రౌడీలతో అడ్డుకోవడం, వారికి పోలీసులు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చెయ్యనియ్యకుండా పోలీసు అధికారులు చేసిన ప్రయత్నంతో రాష్ట్ర పోలీసుల పరువు పోయిందన్నారు. ఇందుకు కారకులైన ఎస్పీ, డీజీపీలను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నించిన తనపై 14 కేసులు పెట్టారని, అందులో రేప్ కేసు కూడా ఉందన్నారు. తన పాస్పోర్టును నిలుపుదల చేశారని చెప్పారు. తెదేపా మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదన్నారు. వైకాపా నేతలు ఎన్ని ఆటంకాలు కల్పించినా పది లక్షలకు తక్కువ లేకుండా జనం వస్తారని పేర్కొన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వి.అనిత మాట్లాడుతూ కార్యకర్తలను నేతలుగా చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ మునసబుగా ఉన్న తనను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ను చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగజగదీశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీలు వేపాడ[ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ నేతలు శ్రీభరత్, పి.వి.జి.కుమార్, బత్తుల తాతయ్యబాబు, ప్రగడ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, బొలిశెట్టి శ్రీనివాసరావు, డాక్టరు నారాయణరావు, మాదంశెట్టి నీలిబాబు, సబ్బవరపు గణేష్, కాయల మురళి, మళ్ల సురేంద్ర, జోగినాయుడు, కొణతాల రత్నకుమారి పాల్గొన్నారు.
పాల్గొన్న కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
[ 20-05-2024]
కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. -
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
[ 20-05-2024]
ఎన్నికల విధుల పట్ల ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. కష్టానికి తగ్గట్టుగా చెల్లింపులు చేయలేదని, పైగా అల్పాహారాలు భోజనాలు సకాలంలో రాకపోవడమే కాకుండా, రుచికరంగా లేవంటూ నిట్టూర్చుతున్నారు. -
మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
[ 20-05-2024]
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. -
సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
[ 20-05-2024]
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు. -
వైకాపా నాయకుడి దౌర్జన్యంపై ఫిర్యాదు
[ 20-05-2024]
పప్పుశెట్టిపాలెం సర్పంచి భర్త వైకాపా నాయకుడు రామకృష్ణ నాయుడు తమపై దౌర్జన్యం చేశారని తెదేపా మండల కమిటీ సభ్యుడు బెల్లం కొండలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
[ 20-05-2024]
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. 2023 ఆగస్టు నుంచి సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. -
రెచ్చిపోతే చిక్కులే..
[ 20-05-2024]
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలన్నీ స్ట్రాంగ్రూమ్ల్లో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు గెలుపోటములు ఎవరివో చెప్పలేం. అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతోంది. -
కిక్కిరిసిన తీరం
[ 20-05-2024]
ఆదివారం సెలవు కావడంతో ఆర్కే బీచ్లో సేద తీరేందుకు పర్యాటకులు, నగర వాసులు పోటెత్తారు. పిల్లలకు వేసవి సెలవులు కావడం, ఎన్నికలు కూడా ముగియడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగి బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. కూలీలు పనులకు రాకుండానే దొంగ మస్తర్లు వేస్తున్నారని మాజీ సర్పంచి ఏడువాక లక్ష్మణకుమార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ఆకట్టుకున్న నాటికలు
[ 20-05-2024]
అనకాపల్లిలోని వీవీ రమణ రైతుభారతిలో నిర్వహిస్తున్న జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. -
రెండవ రోజు కొనసాగిన చందనం అరగదీత
[ 20-05-2024]
వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈనెల 23వ తేదీన అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ జరగనుంది. ఆ మేరకు సింహగిరిపై జరుగుతున్న చందనం అరగదీత కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ చికిత్స కోసం కేజీహెచ్కు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM