బస్తీ పిల్లలకు స్వర్గధామాలు
పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు.
ఈనాడు, వరంగల్
వరంగల్ ఎంహెచ్ నగర్ పేదలబస్తీలో..
పేదల బస్తీలంటే ఎటు చూసినా గుడిసెలు, మురికి కాలువలు కనిపిస్తాయి. ఇక్కడి వారికి మంచి ఆటస్థలాలు కూడా అందుబాటులో ఉండవు. అలాంటిది ఆహ్లాదకరమైన ఆటమైదానాలను వారి కోసం సిద్ధం చేస్తోంది వరంగల్ మహానగరపాలక సంస్థ. వరంగల్, హనుమకొండల్లో ఇప్పటికే మురికివాడల పిల్లల కోసం అయిదారు పార్కులు సిద్ధమయ్యాయి. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో పిల్లలు ఇందులో ఆడుకుంటున్నారు. వారికి ఈ పార్కులు స్వర్గధామంలా ఉన్నాయి.
గతేడాది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వంద ఆకర్షణీయ నగరాల్లో ‘నర్చరింగ్ నైబర్హుడ్ ఛాలెంజ్’ కింద ఒక పోటీ పెట్టింది. తల్లులు, పిల్లలకు (మాతాశిశు) ఆహ్లాదం పంచేలా ఆయా నగరాల్లో పార్కులు, ఆటస్థలాల అభివృద్ధి చేయాలన్నది దీని లక్ష్యం. ఈ క్రమంలో వరంగల్ ఎంహెచ్ నగర్, కాశీబుగ్గ క్రిస్టియన్ కాలనీల్లోని చెత్తాచెదారంతో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకొని పిల్లలు ఆడుకునేలా ఉద్యానవనంగా మార్చారు. దీనికి ‘చిట్టి పార్కు’లుగా నామకరణం చేశారు. వరంగల్ మహానగరపాలక సంస్థ 44, 72 గంటల్లో వీటి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా పది నగరాలు ఈ పోటీలో విజేతలుగా నిలిస్తే అందులో వరంగల్ ఒకటి.
పిల్లలను ఆకట్టుకునేలా..
గ్రేటర్ వరంగల్ అధికారులు నగరంలోని మరికొన్ని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పిల్లలకు ఆట స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ మైసయ్య నగర్లో చిన్నారుల కోసం మైక్రో పార్కును నిర్మించారు. గుండుబావిలో సైతం పిల్లల కోసం మరొకటి తీర్చిదిద్దారు. వీటి గోడలపై రంగురంగుల అక్షరాలు, బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు ఆడుకునే సరదా రైడ్లు, చిన్న వ్యాయామాలు చేసి పరికరాలను ఏర్పాటుచేశారు. వీటితోపాటు, హనుమకొండ శ్రీనగర్కాలనీలో ఏర్పాటుచేసిన పార్కులో పిల్లలు కాసేపు ఆడుకున్నాక అక్కడే చదువుకునే వసతులు కల్పించారు. రాజీవ్నగర్ పార్కులో రాత్రి పది గంటల వరకు పరిసరాల్లోని చిన్నారులు స్వేచ్ఛగా ఆడేందుకు హైమాస్ట్ లైట్లను ఏర్పాటుచేసి, ఆట వస్తువులు అందుబాటులో పెట్టింది బల్దియా. ఉదయం వేళ బడికి వెళ్లే తొందరలో పార్కుకు వచ్చే వీల్లేకపోయినా, సాయంత్రం నుంచి రాత్రి వరకు స్వేచ్ఛగా ఆడుకునేందుకు చిన్నారుల కోసం నైట్ పార్కులను కూడా సిద్ధం చేస్తున్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకం కింద ఉన్నందున హనుమకొండ పబ్లిక్గార్డెన్ను సైతం స్మార్ట్సిటీ నిధులతో తీర్చిదిద్ది రాత్రివేళ చిన్నారులు స్వేచ్ఛగా గడిపే వసతులు కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి