దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు.
ఆయన పాలనలో చేసిందంతా దగానే
అట్టడుగువర్గాలపై దాడులు జరుగుతున్నా మౌనం
అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణపై ప్లేట్ ఫిరాయింపు
ఎస్సీ, ఎస్టీలెవరూ వైకాపాకు ఓటేయొద్దు
వర్గీకరణకు తెదేపా హామీ.. అందుకే కూటమికి మద్దతు
‘ఈనాడు’తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
ఈనాడు, అమరావతి
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. తెదేపా ప్రభుత్వం తెచ్చిన 27 ప్రత్యేక పథకాలను రద్దు చేయడమే కాదు.. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్ని దారి మళ్లించి తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో చేసిందంతా మోసమేనన్నారు. దళితులపై వైకాపా నేతలు అరాచకాలకు తెగబడుతున్నా ఏనాడూ అడ్డుకట్ట వేయలేదని మండిపడ్డారు. దళిత, గిరిజనుల కోసం ఒక్క ప్రత్యేక పథకాన్నీ అమలు చేయని జగన్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై విచారణ సందర్భంగా రాష్ట్రం తరఫున న్యాయవాదిని నియమించాలని జగన్ను కోరినా పట్టించుకోలేదన్నారు. దళిత, గిరిజనులను అన్నిరకాలుగా అణగదొక్కేందుకే ప్రయత్నించారని విమర్శించారు. ఆత్మగౌరవమున్న ఏ దళితుడు, గిరిజనుడు జగన్కు ఓటేయొద్దని పిలుపునిచ్చారు. శనివారం ‘ఈనాడు’తో ఆయన మాట్లాడారు.
చంపేసి డోర్డెలివరీ చేసే స్థాయికి దళితులపై దాడులు
దళిత యువకుణ్ని చంపి డోర్ డెలివరీ చేసే స్థాయికి దాడుల తీవ్రతను జగన్ పెంచారు. ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. దళితులకు శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష పడితే.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. దళితులకు ఇంతకు మించిన అవమానం ఏముంటుంది?
మాస్క్ అడగటమే దళిత డాక్టర్ నేరమా?
డాక్టర్ సుధాకర్ ఏ నేరం చేశారని శారీకరంగా, మానసికంగా వేధించి పొట్టన పెట్టుకున్నారు. కరోనా కాలంలో సరైన మాస్కులు లేవని అడిగినందుకు దళిత డాక్టర్ను మండుటెండలో చేతులు వెనక్కి విరిచి నడిరోడ్డుపై పడుకోబెట్టి హింసిస్తారా? ఈ ఘటనలు తలచుకున్నప్పుడుల్లా ఇలాంటి బతుకులు ఇప్పటికీ బతుకున్నామని కుమిలిపోతున్నాం.
రేషన్ బియ్యం కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సాయమేనా?
రేషన్ బియ్యం అన్ని వర్గాల పేదల కోసం దశాబ్దాలుగా అమలు చేస్తున్న పథకం. జగన్ ఆ పథకంలోని ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల సంఖ్యను పక్కకు తీసి, అదే ప్రత్యేక సాయమన్నట్టుగా లెక్కలు చూపించడం దుర్మార్గం. జగన్ అన్ని పథకాల్లోనూ ఇలాగే ఎస్సీ, ఎస్టీలను దెబ్బతీశారు.
మద్య నిషేధం చేయకుండా ఓట్లడుగుతారా?
మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్ మాట తప్పారు. పైగా సొంత కంపెనీలు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారు. కల్తీ మద్యంతో లక్షల మంది అనారోగ్యం పాలయ్యేలా చేశారు. వేల మంది మరణించారు. ఇక జగన్కు ప్రజల్ని ఓట్లడిగే హక్కు ఎక్కుడుంది?
నిరుద్యోగ యువతను వలసబాట పట్టించారు
అమరావతిని విధ్వంసం చేసి, ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత జగన్దే. ఐదేళ్లలో ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి పూర్తిగా కనుమరుగైంది. పరిశ్రమలు తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించకుండా మాటలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలనూ తరిమికొట్టారు. ఉపాధి లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి తెచ్చారు.
వర్గీకరణపై జగన్ మోసం
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే మాదిగలకు, ఉపకులాలకు 22 వేల ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. ఉన్నత విద్యలో న్యాయమైన వాటా దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన స్వర్ణయుగం అయితే జగన్ పాలన నవ్యాంధ్రకు శాపం. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా వర్గీకరణ కోసం కృషి చేశారు. జగన్ మాత్రం గత ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటించి, తర్వాత ప్లేట్ ఫిరాయించేశారు. వర్గీకరణ ఇప్పుడు మళ్లీ కీలక దశకు చేరింది. మోదీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాసనసభలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వ్యవస్థల్లో మాదిగలకు భాగస్వామ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం.
దళిత, గిరిజనులు అభివృద్ధి చెందకూడదనేది జగన్ ఎత్తుగడ
ఎస్సీ, ఎస్టీల్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, పథకాలు అమల్లోకి తెచ్చి.. వారి కోసం ఖర్చు చేశాయి. కానీ జగన్ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉపప్రణాళిక నిధుల్ని ఇతర కార్యక్రమాలకు యథేచ్ఛగా మళ్లించారు. వారికి ఏళ్లుగా అందుతున్న ప్రత్యేక సాయానికి పాతరేశారు. అందరికీ వర్తింపజేసే పథకాలనే వారికీ ఇస్తూ దాన్నే గొప్పగా ప్రచారం చేశారు. ఎస్సీ, ఎస్టీలు ఎప్పటికీ అభివృద్ధి చెందకూడదనే ఆలోచనతోనే ఇదంతా చేశారు. నిధులు కేటాయించకుండా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం