జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా.
అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్ డి ప్రభుత్వం ఇది
రైతుల కష్టాలు జగన్కు తెలియదు
రేపల్లె, గుడివాడ, అవనిగడ్డ సభల్లో పవన్కల్యాణ్ ధ్వజం
ఈనాడు, బాపట్ల: ‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. దీన్ని తెలివిగా జగన్ తీసుకొస్తున్నారు. అదేమంటే కేంద్రం తెచ్చిందని చెబుతున్నారు. అలా అని అడ్డగోలుగా ప్రజలకు చెప్పకుండా రుద్దేస్తారా.. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దెబ్బకు మీ భూములు మీకు కాకుండా పోతాయి. ప్రభుత్వ ఆస్తులనే విచ్చలవిడిగా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న జగన్కు మన ఆస్తులు ఒక లెక్కా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ ఐదేళ్ల పాలనలో గోతులు.. బూతులు తప్ప ఇంకేం లేవన్నారు. శనివారం బాపట్ల జిల్లా రేపల్లె, కృష్ణా జిల్లా గుడివాడ, అవనిగడ్డల్లో నిర్వహించిన వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అసలు జగన్ను ఎలా నమ్ముతాం. ఇప్పటికే విశాఖలోనే రూ.25 వేల కోట్ల విలువగల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారు. ఆయన ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైకాపాను ఓడించాలి. ఆ పార్టీకి ఓటేస్తే కొరివితో తల గోక్కున్నట్లే అని గుర్తించాలి’ అని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ‘రైతుల కష్టాలు ఎలా ఉంటాయో జగన్కు తెలియదు. రైతుల భూములను లాగేసుకోవడం, పచ్చని చెట్లను నరికేయడమే ఆయనకు తెలుసు. భూమిలో గుప్పెడు గింజలు వేసి పంట తీయడం జగన్కు తెలియదు. కానీ భూమి లోపల ఉన్న ఖనిజాలను తీసి వాటిని దోచేయడం తెలుసు’ అని విరుచుకుపడ్డారు. ‘అడ్డగోలుగా మట్టి తవ్వేవారు చివరకు మట్టిలోనే కలిసిపోతారు. కూల్చేవాడు ఉంటే కట్టేవారు కూడా ఉంటారనేది వైకాపా నాయకులు గుర్తుపెట్టుకోవాలి’ అని పవన్కల్యాణ్ హెచ్చరించారు.
బూతులకు పన్నులు వేస్తే...
రాష్ట్రంలో వైకాపా నేతల దాడులు, బూతులకు పన్నులు వేస్తే వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి నిధుల కొరత పూర్తిగా తీరిపోతుందని పవన్ ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో గోతులు.. బూతులు తప్ప ఇంకేం లేవన్నారు. ‘వాళ్ల తాత కాలం నుంచి ప్రజల ఆస్తులను దోచుకోవడానికి జగన్ అలవాటుపడ్డారు. ఎవరైనా నిలదీస్తే బూతులు.. దాడులు చేస్తారు. బ్లేడ్ బ్యాచ్ను కూడా మనపైకి ఉసిగొల్పుతున్నారు. ఇళ్లలో ఉన్న మహిళలనూ తిడుతున్నారు. దాడులు, దోపిడీలు మాత్రమే చేసే డబుల్ డి ప్రభుత్వం ఇది. చివరికి జగన్ వేలు చూపించి బెదిరిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. మన సభలకు స్థలాలు ఇస్తే.. వాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ బెదిరింపులన్నీ శాశ్వతంగా ఆగిపోతాయ్’ అని పవన్ స్పష్టం చేశారు.
తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తాం
‘మడ అడవులను సైతం జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసి తీర ప్రాంత వాసులకు రక్షణ లేకుండా చేస్తోంది. ఇప్పటికే 1500 ఎకరాల్లో వాటిని ధ్వంసం చేశారు. మేం అధికారంలోకి రాగానే సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతాం’ అని జనసేనాని అన్నారు.
చిరంజీవిని జగన్ అవమానించారు.
‘నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకుండా చిరంజీవిని జగన్ అగౌరవపరిచారు. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడిని ఇబ్బంది పెట్టారు. జగన్కు కావాల్సింది బానిసలు. ఆత్మగౌరవం కోరుకునేవారు కాదు’ అని పేర్కొన్నారు.
జగన్కేం తెలుసు తెలుగు మాధుర్యం..
కాపీలు కొట్టి పాసయ్యే జగన్కు.. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం, గొప్పతనం ఏం తెలుస్తాయని పవన్ ఎద్దేవా చేశారు. ‘మేం మాతృభాషను మరచిపోవద్దని కోరుతుంటే.. ఆంగ్లం వద్దంటున్నామని జగన్ విష ప్రచారం చేస్తున్నారు. అసలు చదువుకుంటే కదా.. మేం ఏం చెబుతున్నామో అర్థం కావడానికి. మన భాషే లేకపోతే.. గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ లాంటి మహనీయుల రచనలు భవిష్యత్తు తరాలకు ఎలా అర్థమవుతాయి. మన చరిత్ర ఎలా తెలుస్తుంది. తెలుగును మనం రక్షించుకోకపోతే.. ఆంగ్లేయులు కాపాడతారా?. వైకాపా వాళ్లకు బూతులు తిట్టడానికేనా తెలుగు. మాతృభాష మాధుర్యం అర్థమవ్వని వ్యక్తి.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి’ అని పవన్ మండిపడ్డారు.
ఈ అవకాశం చేజార్చుకోవద్దు..
వైకాపా నాయకుల అరాచకాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తూనే ఉన్నాయని పవన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో వారికి భయపడకుండా ముందుకొచ్చి ఓట్లేయాలన్నారు. ఈ ఒక్క అవకాశం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. ఎవరూ వదులుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
మండుటెండలో పోటెత్తారు...
గుడివాడ సభ మధ్యాహ్నం ఒంటిగంటకు విపరీతమైన ఎండలో జరిగింది. అయినా.. పవన్ కోసం జనసైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు పోటెత్తారు. ప్రసంగిస్తున్న సమయంలోనూ ప్రతి మాటకూ ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. అవనిగడ్డలో సభ జరిగిన రాజీవ్గాంధీ చౌక్ కూడా.. కూటమి శ్రేణులతో కిక్కిరిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన