icon icon icon
icon icon icon

రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది.

Published : 26 Apr 2024 04:37 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. తెదేపా, జనసేన, భాజపా, వైకాపా, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులూ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సంఖ్యను సీఈఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img