icon icon icon
icon icon icon

రాష్ట్రం నుంచి కాలకేయులను తరిమికొడదాం

రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 05:57 IST

ఓటుహక్కుతోనే బుద్ధి చెబుదాం
కైకలూరు సభలో సినీరచయిత విజయేంద్రప్రసాద్‌

మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తినే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌, ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా ఆటపాక నుంచి లోకుమూడి వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కైకలూరులోని సీఎన్‌ఆర్‌ కల్యాణవేదికలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేవారినే ఎన్నుకోవాలని సూచించారు. మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎంతో అద్భుతమైన పాలనను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో కైకలూరుకు కామినేని నాయకత్వంలో మహర్దశ పడుతుందని జోస్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img