ఇన్నేళ్లూ వివేకా హత్యకేసు దోషులను ఎందుకు తేల్చలేదు?
‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత గానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉంటే కేసు సీˆబీఐకి వెళ్లకముందే సీఎం హోదాలో 11 నెలల పాటు ఎందుకు దోషులను తేల్చలేకపోయారు’ అని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ సీఎం జగన్ను ప్రశ్నించారు.
జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్
పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన దస్తగిరి
వేంపల్లె, న్యూస్టుడే: ‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె సునీత గానీ, ఇతరుల ప్రమేయం గానీ ఉంటే కేసు సీˆబీఐకి వెళ్లకముందే సీఎం హోదాలో 11 నెలల పాటు ఎందుకు దోషులను తేల్చలేకపోయారు’ అని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ సీఎం జగన్ను ప్రశ్నించారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని మినీ సెక్రటేరియట్లో గురువారం ఆ పార్టీ అభ్యర్థిగా వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం దస్తగిరితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘11 నెలలుగా మీ ఆధ్వర్యంలోనే పోలీసులు ఉన్నా వివేకాను ఎందుకు హత్య చేశారు, డబ్బుల కోసం ఎవరైనా చేయించారా, లేక ఆస్తి కోసం రెండోభార్య చేయించారా అని ఎందుకు తేల్చలేకపోయారు? ఈ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన అబద్ధాలను రాష్ట్ర ప్రజలు, పులివెందుల, కడప ప్రజలు తెలుసుకోవాలి. హత్యకేసు నిందితుడైన దస్తగిరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఎందుకిచ్చారని చాలామంది అడుగుతున్నారు. దస్తగిరి కోర్టు ముందుకు వెళ్లి తాను నేరం చేశానని, ఏ శిక్ష వేసినా భరిస్తానని ఒప్పుకొన్న సాక్షి. ఓ వ్యక్తి మరణాన్ని, ఓ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని అలుసుగా తీసుకుని 2019లో అధికారాన్ని సాధించి 2024లో మళ్లీ అధికారాన్ని సాధించాలనే ఆలోచన కచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’’ అని జడ శ్రావణ్కుమార్ అన్నారు.
వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలను అడిగితే చెబుతారు
మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో, ఎవరు చంపించారో ప్రజలను అడిగితే చెబుతున్నారని జై భీమ్ భారత్పార్టీ పులివెందుల నియోజకవర్గ అభ్యర్థి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అన్నారు. ‘జగన్.. పులివెందుల సభలో ఏదో చెబుతున్నారు.. ధైర్యముంటే ప్రజలకు మైకు ఇచ్చి వివేకానందరెడ్డి హత్యపై ఎలాంటి అనుమానాలు ఉన్నాయో అడిగితే తెలుస్తుంది. నేను పులివెందుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నేను ఈ రోజు 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభించాల్సి ఉంది. సీఐ ఫోన్ చేసి 2.30 గంటలకు ర్యాలీ, నామినేషన్ పెట్టుకోవాలని చెప్పారు. లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇందుకు నేను అంగీకరించాను. నేను నామినేషన్ వేయకపోతే రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. నామినేషన్ వేస్తే మైనారిటీ ఓట్లు పోతాయని చెప్పారు. దాంతో తాము ఇబ్బంది పడతామని ఎంపీ అవినాష్రెడ్డి, జగన్రెడ్డి అనుచరులు చెప్పినా నేను నిరాకరించాను’ అని చెప్పారు. పులివెందుల ప్రజలు ఓట్లు వేసి తనని గెలిపించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినీ హీరో సాయి ధరమ్తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. జనసైనికులపై వైకాపా వర్గీయుల దాడి
జనసేనాని పవన్ కల్యాణ్కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ చేపట్టిన ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై వైకాపా వర్గీయులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. -
మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లు.. ఇదీ వైకాపా పాలన: పవన్ కల్యాణ్
వైకాపా పాలన మూడు కబ్జాలు.. ఆరు సెటిల్మెంట్లుగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల మెడకు ఉరితాడు: చంద్రబాబు
సూపర్ సిక్స్, మోదీ హమీలు చూసి జగన్కు నిద్రపట్టడం లేదని తెదేపా(TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. -
సీఎం రమేశ్పై దాడి.. జగన్ ఫ్రస్టేషన్కు ఉదాహరణ: గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి లోక్సభ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడిని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. -
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
మా మామ నీచుడు.. అతనికి ఓటేస్తే సమాజానికి చేటు: డాక్టర్ గౌతమ్
ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే పవిత్రమైన ఎమ్మెల్యే పదవి అపవిత్రమవుతుందని ఆయన రెండో అల్లుడు గౌతమ్ అన్నారు. -
రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని మోదీనే: ధర్మవరం సభలో చంద్రబాబు
దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే అని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
ఏపీలో చంద్రబాబు.. కేంద్రంలో మోదీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్షా
ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే తెదేపా, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్షా అన్నారు. -
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై ఈసీ బదిలీ వేటు
ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేశారు. వారిపై అందిన ఫిర్యాదులపై మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!