ఏప్రిల్ నుంచే పింఛను రూ.4 వేలు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
దివ్యాంగులకు రూ.6 వేలు..
ఏప్రిల్, మే, జూన్ నెలల పెంచిన మొత్తాలూ ఇస్తాం
అంగళ్లు, అనంతపురం సభల్లో చంద్రబాబు
ఈనాడు, తిరుపతి, ఈనాడు డిజిటల్, అనంతపురం: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రత పింఛను రూ.4 వేలకు పెంచి అందజేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పెంచిన సొమ్మును ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి ఒకేసారి ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఇంటికే తీసుకువచ్చి మొదటి తేదీనే పంపిణీ చేయిస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాళ్లు, చేతులు లేనివారికి రూ.15 వేలు చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు, అనంతపురం నగరంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెంచిన నగదును ఇస్తానని చెబుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎప్పుడో 2028లో రూ.250 చొప్పున పెంచి ఇస్తామని చెబుతున్నారు. సంపద సృష్టించడం ద్వారా నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పిన మేర సంక్షేమ ఫలాలు అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.
పథకాలు ఆగుతాయని దుష్ప్రచారం చేస్తున్నారు..
‘కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆగుతాయని వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం వస్తే ఆగేది జగన్ ఆదాయం మాత్రమే. ఇసుక మాఫియా, మైనింగ్ దోపిడీ, ఎర్రచందనం స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఆయనకు నిలిచిపోవడం ఖాయం. ఈ నెల 13 తర్వాత ఫ్యాను గిరగిరా తిరగదు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమిని కొట్టేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8 వేల ఎకరాలు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10 వేల ఎకరాలు, వాన్పిక్ సిటీ పేరుతో 28 వేల ఎకరాలు కాజేశారు. విశాఖలో కార్తికవనం, ఎన్సీసీ భూములు, హయగ్రీవ భూములను హస్తగతం చేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్ అనుకుంటున్నారు. ఆయన చేసిన పాపాలకు ప్రజాకోర్టులో శిక్ష ఖాయం’ అని మండిపడ్డారు.
వైకాపాతో సామాజిక న్యాయం కల్ల
‘నేతి బీరకాయలో నెయ్యి ఎలానో.. వైకాపా చెబుతున్న సామాజిక న్యాయం కూడా అంతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిందేం లేదు. వారికి పేరుకే పదవులు ఇచ్చి అధికారం మొత్తం తన చేతుల్లో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ సబ్ప్లాన్ తీసుకొచ్చి అన్ని వర్గాలకూ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తాం. వడ్డెర్ల అభివృద్ధికి కృషి చేస్తాం. ఉద్యోగస్థులకు పెండింగ్లో ఉన్న పెన్షన్లు, టీఏ, డీఏలు, పీఆర్సీలు అందిస్తాం’ అని స్పష్టం చేశారు.
ముస్లింలకు రూ.వంద కోట్లతో కార్పొరేషన్
‘తెదేపా గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు ఏనాడూ ముస్లింలకు అన్యాయం జరగలేదు. వైకాపా పాలనలో అబ్దుల్సలీంను ఇబ్బందులకు గురిచేయడంతో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ముస్లింలు మక్కాకు వెళ్లేందుకు రూ.లక్ష ఆర్థికసాయం చేసే బాధ్యత మాది. దుల్హన్ పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం. విదేశీ విద్య ద్వారా ముస్లిం యువతకు చేయూత అందిస్తాం. మసీదుల మెయింటినెన్స్కు ఆర్థికసాయం చేస్తాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముస్లింల కోసం రూ.వంద కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం’ అంటూ భరోసా ఇచ్చారు.
‘రాష్ట్రంలో జరిగే దోపిడీల్లో ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగస్వాములు. మద్యం, మైనింగ్, భూములు, బెరైటీస్, కుప్పంలోని గ్రానైట్ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ల అరాచకాలు లెక్కిస్తున్నా.. చిత్రగుప్తుడిలా ప్రతి లెక్కా సరిచేస్తా. తంబళ్లపల్లె నియోజకవర్గానికి వస్తే నాతో పాటు 600 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. మాకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల్ని బతకనిస్తారా..? ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నా.. అంగళ్లు వస్తూనే ఉంటా. అడ్డం వస్తే సైకిల్తో తొక్కించుకుంటూ పోతా’ అంటూ మంత్రి పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రి జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తా’ అని ప్రకటించారు. జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని చిత్తుగా చేసి.. చెత్తబుట్టలో వేద్దాం అంటూ చించివేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
-
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
-
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు నేడే