icon icon icon
icon icon icon

సజ్జల భార్గవ్‌రెడ్డి దుష్ప్రచారంపై ఈసీ ఆగ్రహం

వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుకున్నారంటూ.. వైకాపా సామాజిక విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారంపై సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 06 May 2024 06:00 IST

వెంటనే విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని సీఐడీని ఆదేశించిన సీఈవో
వర్ల రామయ్య ఫిర్యాదుకు స్పందన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుకున్నారంటూ.. వైకాపా సామాజిక విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి చేయిస్తున్న దుష్ప్రచారంపై సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐడీని ఆదేశించారు. ఈ మేరకు సీఐడీ డీజీ(సైబర్‌సెల్‌)కి ఆదివారం ఆదేశాలు జారీచేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా వాళ్లు ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శనివారం ఇచ్చిన ఫిర్యాదుపై సీఈవో స్పందించారు. ‘‘సామాజిక పింఛన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఇవ్వనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ పింఛనుదారులకు వైకాపా వాళ్లు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తున్నారు. వడదెబ్బ వల్ల సంభవించిన మరణాలకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ రికార్డు ఆడియో మెసేజ్‌లు పంపుతున్నారు. సజ్జల భార్గవ్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అని తన లేఖలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img