icon icon icon
icon icon icon

ఆర్యవైశ్యుల స్థలాలను కబ్జా చేసిన కొడాలి నాని అనుచరులు

గుడివాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గంవారు కొనుగోలు చేసిన 11 ఇళ్ల స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరులు ఆక్రమించారని తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 07 May 2024 05:13 IST

తెదేపా నేత సునీల్‌కుమార్‌ ఆరోపణ

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడలో ఆర్యవైశ్య సామాజిక వర్గంవారు కొనుగోలు చేసిన 11 ఇళ్ల స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరులు ఆక్రమించారని తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్‌కుమార్‌ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలన్నారు. తమపై కక్ష సాధింపు చర్యలకు దిగి కల్యాణ మండపానికి ఆనుకొని డంపింగ్‌ యార్డు నిర్మించారన్నారు. ‘విద్యావికాస్‌’ వెనుక చైతన్య సహకార సొసైటీ పేరుతో ఉన్న 11 ప్లాట్లను నాని అనుచరులు దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. వైశ్యులకు తెదేపా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img