December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటును లక్ష్యంగా చేసుకొని 2001లో ఉగ్రవాదులు చేసిన దాడి (Indian Parliament attack) ప్రతి భారతీయుడి కళ్లలో కదలాడుతూనే ఉంది. 22 ఏళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో తొమ్మిది మంది అమరులు కాగా మరో 18 మంది గాయాలపాలవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉండే పార్లమెంటుపై ఉగ్రవాదుల దుశ్చర్య దేశ భద్రతా వ్యవస్థకు సవాలు విసిరింది. అప్పటి విషాదాన్ని తలచుకుంటున్న రోజునే (December 13, 2001) పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన దాడి ఘటనను గుర్తుచేసుకుంటే..
ఎర్రబుగ్గ కారులో వచ్చి..
పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament winter session) జరుగుతోన్న వేళ.. డిసెంబర్ 13, 2001 ఉదయం 11.40గంటలకు ఐదుగురు సభ్యుల ఉగ్రమూక పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్తో కూడిన ఓ అంబాసిడర్ కారు లోపలికి వచ్చింది. గేటు నంబర్ 12వైపు రాగానే అక్కడి భద్రతా సిబ్బందిలో (పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ సెక్షన్) ఒకరు ఈ కారును అనుమానించారు. వాహనాన్ని వెనక్కి వెళ్లాలని తేల్చిచెప్పారు. అలాగే దూసుకొచ్చిన కారు, ముందున్న వాహనాన్ని (పార్క్ చేసిన అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ వాహనం) ఢీకొట్టింది. అంతలోనే ఆ అనుమానిత కారులో ఉన్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం మొదలుపెట్టారు.
పార్లమెంటులో పొగగొట్టాలు తీసుకువచ్చిన.. ఆ నలుగురు ఎవరు..?
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సైరన్ మోగించారు. దాంతో ఆ ప్రాంగణంలోని భవనాల గేట్లన్నీ మూసివేశారు. అప్పటికే ఇరువైపులా జరుగుతోన్న కాల్పులు దాదాపు 30నిమిషాల పాటు కొనసాగాయి. కారులో వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. కానీ, ఆ ఘటనలో ఎనిమిది మంది భారత భద్రతా సిబ్బంది సహా ఓ తోటమాలి ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులు కాల్పులు జరుగుతోన్న సమయంలో ఉభయసభలు వాయిదా పడినప్పటికీ.. దాదాపు 100 మంది ఎంపీలు, మంత్రులు పార్లమెంటు లోపలే ఉన్నారు.
పాకిస్థాన్ కుట్ర..
పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలే పార్లమెంటుపై దాడి జరిపినట్లు స్పష్టమైందని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్కే అడ్వాణీ లోక్సభలో ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురూ పాకిస్థానీ ఆత్మాహుతి దళాలేనన్నారు. పార్లమెంటుపై దాడికి పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రపన్నినట్లు పోలీసులు అనుమానించారు. ఈ దాడికి సంబంధించి డిసెంబర్ 13న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దుండగులు ఉపయోగించిన కారు, సెల్ఫోన్ రికార్డుల ఆధారంగా ఈ దాడికి కుట్ర పన్నిన వారిని అరెస్టు చేశారు.
అఫ్జల్ గురుకి ఉరి..
ఈ కేసులో మహ్మద్ అఫ్జల్ గురు, అతడి సమీప బంధువు షౌకత్ హుసేన్ గురు, షౌకత్ భార్య ఆఫ్సాన్తోపాటు గిలానీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు అఫ్సాన్ను నిర్దోషిగా తేల్చింది. గిలానీ, షౌకత్తోపాటు అఫ్జల్ గురులకు మరణశిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లిన గిలానీ నిర్దోషిగా బయటకు రాగా.. షౌకత్ మరణశిక్షను పదేళ్ల కఠిన కారాగార శిక్షకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాడుల సూత్రధారి అఫ్జల్ గురుకు మాత్రం ఊరట లభించలేదు. మరణశిక్ష విధించాలంటూ సెప్టెంబర్ 26, 2006న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం రాష్ట్రపతి క్షమాభిక్షకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అఫ్జల్ గురు కుటుంబం అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో చివరకు ఫిబ్రవరి 9, 2013న దిల్లీలోని తిహాడ్ జైలులో అఫ్జల్ గురుకి మరణశిక్ష అమలయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే