Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. పులొచ్చింది మామో..!
చెన్నూరు అటవీ సబ్ డివిజన్ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. పశువులను హతమారుస్తూ హల్చల్ చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ట్రిపుల్ఐటీ ప్రవేశాల ప్రకటన ఎప్పుడో?
రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కులపతి ఆచార్య కె.చెంచురెడ్డి మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రవేశాల ప్రకటన జారీ చేస్తాం. 2008, 2009, 2010లలో రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి పదోతరగతి టాపర్లతో సంబంధం లేకుండా కనీసం ఒక్క విద్యార్థికైనా సీట్లు ఇచ్చాం. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించడంతో పక్కన పెట్టాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* స్వాతంత్ర్యానికి ముందే... రయ్ రయ్
3. రాత్రికి రాత్రే చెరువుగా
ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలను దర్జాగా కజ్జా చేసేస్తున్నారు. ఇటువంటి సంఘటనే మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అజ్ఞాత సమర యోధుడు కోరుకొండ
కొండరెడ్డి తెగ గిరిజనుడైన కోరుకొండ సుబ్బారెడ్డి అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలకుల నుంచి గిరిజనులను వెట్టిచాకిరీ నుంచి విముక్తులను చేసేందుకు పోరాడి ప్రాణత్యాగం చేశారు. బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరగడంతో ఆయన్ను ఉరి తీశారు. కోరుకొండ సుబ్బారెడ్డి పేరు చెబితే బ్రిటిషు పాలకులకు సింహ స్వప్నం. ఏడాది కాలం ఆయన చేసిన పోరాటంతో.. ఆయన్ని పట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బ్రిటిషు ప్రభుత్వంపై ద్వేషంతో రగిలిపోయేవారు. భారత మాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఇంటర్ ఉంటేనే అంగన్వాడీ పోస్టు
కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్టైమ్ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించింది. ఈమేరకు ‘మిషన్ సాక్షం అంగన్వాడీ, పోషణ్ అభియాన్ 2.0’ విధివిధానాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటా 40వేల చొప్పున అయిదేళ్లలో 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరించనుంది. అలాగే అంగన్వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. నేటి నుంచి ‘అగ్నివీర్’ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఈనెల 14 నుంచి 31 వరకు జరిగే ‘అగ్నివీర్’ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ ఎంపికల్లో నిత్యం సుమారు 3వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో స్టేడియంకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రేషన్ సరకుల్లో కోత
నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రేషన్ పంపిణీ విధానం అమల్లో అభాసుపాలవుతోంది. సరకుల పంపిణీ విధానం చూస్తుంటే ప్రభుత్వం దృష్టిలో రేషన్ అంటే కేవలం బియ్యం ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. గతంలో చౌక దుకాణాల ద్వారా వేర్వేరు సరకులను పేదలకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం బియ్యం పంపిణీకే పౌరసరఫరాల విభాగం పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు కోటా కింద కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* 16న ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
9. లోతట్టున కలవరం
లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లంక భూములు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం..కోనసీమ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ