రాత్రికి రాత్రే చెరువుగా
ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
కజ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
చెరువుగా మార్చిన ప్రభుత్వ స్థలం
కైకలూరు, న్యూస్టుడే: ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలను దర్జాగా కజ్జా చేసేస్తున్నారు. ఇటువంటి సంఘటనే మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలోని సోమేశ్వరంలో సర్వే నంబరు 16లో 1.75 ఎకరాల ప్రభుత్వ గ్రామ కంఠం భూమి ఉంది. 4 దశాబ్దాల క్రితం 1984లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఈ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ఇందిరా కాలనీగా కేటాయించారు. ఆ సమయంలో కొందరు పూరి గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో ముంపునకు గురవుతున్నాయని నివాసితుల కోరిక మేరకు మరోచోట స్థలం మంజూరు చేసి పట్టాలు అందించారు. అప్పటి నుంచి ఈ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాగా ఇటీవల వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ఇక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అధికారులు యంత్రాలతో స్థలం చదును చేసి రెండు రోజులు పనులు నిర్వహించి నిలిపి వేశారు.
ఇదే అదనుగా.. గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది. వీరిలో కొందరికి ఇక్కడ గతంలో పట్టాలు ఇవ్వగా ఇది పల్లం ప్రాంతమని ఎవరూ ఇళ్లు కట్టుకోలేదు. దీంతో వాటిని రద్దు చేసి మరోచోట పట్టాలు ఇచ్చారు. ఈ స్థలానికి కూత వేటు దూరంలోనే జాతీయ రహదారి 165 నూతన రెండులైన్ల మార్గం వెళ్తోంది. దీంతో ఇక్కడ స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. భూమి తమదే అన్నట్లుగా కొందరు ఈ 1.75 ఎకరాలను ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విక్రయించారు. వారు పొక్లెయిన్లతో గురువారం అర్ధ రాత్రి సమయంలో గుట్టుప్పుడు కాకుండా చెరువుగా మార్చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం పలు విమర్శలకు తావిస్తోంది. స్థలాన్ని గ్రామ అవసరాలకు వినియోగించాలని మొర పెట్టుకున్నా స్పందించ లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కనీసం ఎస్సీ శ్మశాన వాటికకైనా ఇవ్వాలని స్థానికులు రెవెన్యూ అధికారులను కలిశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ మురళీకృష్ణను సంప్రదించగా సర్వే నంబరు 16లో ఉన్నభూమి గ్రామకంఠంలో ఉందని, దీంతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని సమాచారంతో వెళ్లి పరిశీలించి పనులు నిలిపి వేశామని తెలిపారు. దీని కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?