సాగుచట్టాల్లో ‘నలుపు’ ఏంటి?
సాగు చట్టాల్లో సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్లో సాగు చట్టాలపై ప్రజలకు తప్పుడు సమాచారం
రాజ్యసభలో వ్యవసాయశాఖ మంత్రి తోమర్
దిల్లీ: సాగు చట్టాల్లో సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్లో సాగు చట్టాలపై ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా తోమర్ నేడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన రైతుల ఆందోళన అంశంపై ఆయన ప్రసంగించారు.
‘‘నల్ల’చట్టాలు అంటూ రైతు సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే వ్యవసాయ చట్టాల్లో నలుపు ఏముందని గత కొన్ని నెలలుగా నేను రైతు సంఘాల నేతలను అడుగుతున్నాను. వాళ్లు చెబితే నేను వాటిని సరిచేస్తాను’ అని తోమర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కొత్త చట్టాలు అమలైతే మీ భూములు లాక్కుంటారంటూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిని కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా ఉందా అని ప్రశ్నించారు.
రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని తోమర్ తెలిపారు. పంటలకు ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక అవసరాల కోసం రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం..
‘పేద ప్రజల అనుకూల పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన స్థితిగతులను మార్చగలిగాం. గ్రామ పంచాయతీల కోసం రూ.2.36లక్షల కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ అంగీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు దాదాపు రూ.43వేల కోట్లు కల్పించాం. కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను రూ. 61వేల కోట్ల నుంచి రూ. 1.115లక్షల కోట్లకు పెంచాం. ఈ పథకం ద్వారా 10కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. సాంకేతికతతో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత సాధించాం’ అని తోమర్ వెల్లడించారు.
ప్రజలు.. ప్రభుత్వమే దేశ బలం
‘2020లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొవిడ్ మహమ్మారి తెచ్చిన ఆంక్షలు ఆర్థిక వ్యవస్థ.. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఆ పరిస్థితులను దేశం కలిసికట్టుగా ఎదుర్కొంది. క్రమశిక్షణతో మహమ్మారిని తరిమికొట్టగలుగుతున్నాం. ప్రజలు.. ప్రభుత్వమే మన దేశ బలం అని చెప్పేందుకు ఆనందంగా ఉంది. కొవిడ్ పోరులో భారత్ విజయం సాధించింది. ఒకప్పుడు పీపీఈ కిట్లను తయారుచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మనం.. ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం’ అని తోమర్ చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం