జైల్లోనే నిరాహార దీక్షకు దిగిన రష్యా విపక్షనేత!
జైలుశిక్ష అనుభవిస్తోన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ నిరాహార దీక్షకు దిగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని అలెక్సీ నావల్నీ ఆరోపించారు.
మాస్కో: జైలుశిక్ష అనుభవిస్తోన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ నిరాహార దీక్షకు దిగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తనకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదని అలెక్సీ నావల్నీ ఆరోపించారు. తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ అలెక్సీ నావల్నీ జైలు అధికారికి ఓ లేఖ రాశారు. రాత్రి సమయాల్లో ప్రతి గంట గంటకూ నిద్ర లేపుతూ తీవ్ర వేదనకు గురిచేస్తున్నారని.. తనకు చికిత్స నిరాకరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన అనారోగ్యాన్ని పరీక్షించేందుకు నిపుణుడిని లోనికి అనుమతించాలని జైలు అధికారులకు విన్నవించినప్పటికీ.. వారం గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్లు నావల్నీ ప్రకటించారు.
రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ విడుదల కోసం గతకొన్ని రోజుల క్రితం రష్యాలో ప్రధాన నగరాలు ఆందోళనలతో దద్దరిల్లాయి. నావల్నీని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆందోళనలకారులను నిలువరించేందుకు అనేక చోట్ల లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో మాస్కో, సెర్బియా, నోవోసిబిర్సిక్, యెకాటెరిన్బర్గ్, యుజ్నో-సఖాలిన్స్క్ సహా మొత్తం 90 నగరాల్లో దాదాపు 3000 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు.
ఇదిలాఉంటే, 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఈ జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. తాజాగా అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్షకు దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
Salman Khan House Firing Case: సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన కేసులో ఒక నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
హెచ్పీజెడ్ టోకెన్ యాప్ (HPZ Token App) పెట్టుబడి పేరుతో మోసానికి పాల్పడిన కేసులో సీబీఐ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు చేసింది. -
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
Deepfake videos: లోక్సభ ఎన్నికల సమయంలో డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. -
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. -
దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. -
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య