Viral video: బిచ్చగాడు చిల్లరతో ఐ ఫోన్ కొంటే..!
బిచ్చగాడు ఐ ఫోన్ (iphone) కొంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. దాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Image: kpsgill1
ఇంటర్నెట్ డెస్క్: ఐ ఫోన్ (iphone) అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనుకాడుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే షాప్ నిర్వాహకులు అతణ్ని ఎలా చూస్తారు? ముందు లోపలికి రానిస్తారా? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ‘ఎక్స్పెరిమెంట్ కింగ్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్పూర్లో కొన్ని మొబైల్ షోరూంలు తిరిగాడు. కొందరు లోపలికి రానివ్వకపోగా.. మరికొందరు చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. చివరగా ఓ షాపు యజమాని చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ను అందజేశాడు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్ అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయాడు.
ఇజ్రాయెల్ - హమాస్ పోరు.. ప్రయాణికులకు ఎయిరిండియా ఊరట
ఈ వీడియో క్లిప్లు నెట్టింట వైరల్గా మారాయి. బిచ్చగాడు ఐ ఫోన్ కొనడమేంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ‘షాపు యజమానికి కస్టమరే దేవుడు. అందుకే చిల్లర తీసుకొని మరీ ఐ ఫోన్ ఇచ్చేశాడని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఐ ఫోన్ కొన్న వ్యక్తి ముంబయిలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించి ఉంటాడని, అందుకే అంత చిల్లర వచ్చిందని’ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఇవన్నీ పాత స్టంట్స్ అని, స్క్రిప్టు రాసుకొని కొత్తగా ఏమైనా ట్రై చేయండని’ మరో నెటిజన్ సలహా ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.