Mallikarjun Kharge: ‘శునకమైనా చనిపోయిందా?’.. ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని భాజపా డిమాండ్ చేసింది. కానీ, ఇందుకు ఖర్గే ససేమిరా అన్నారు.
135 కోట్ల మంది నవ్వుతున్నారంటూ ఛైర్మన్ ఆగ్రహం
దిల్లీ: కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘శునకం’ వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భాజపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు కాంగ్రెస్ నేత ససేమిరా అనడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసింది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణ త్యాగాలు చేశారు. భాజపా దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా కూడా తాము దేశభక్తులనే వారు చెబుతారు. మేము ఏమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’’ అని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. మంగళవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే.. భాజపా నేతలు ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆందోళన లేవనెత్తారు. రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు లోక్సభలోనూ భాజపా, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
మనం చిన్న పిల్లలమా?: ధన్ఖడ్ మండిపాటు
ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాలంటూ భాజపా సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బల్లలపై నిల్చుని నిరసనలు చేశారు. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ధన్ఖడ్ అసహనానికి గురయ్యారు. ‘‘సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’’ అని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అది పార్లమెంట్ వెలుపల జరిగింది. దాని గురించి సభలో ఆందోళనలు సరికాదు. పక్షాల మధ్య అభిప్రాయభేదాలు ఉండొచ్చు. కానీ రాజ్యసభ పక్ష నేత మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కలిగించడం.. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మరో పక్షం అడ్డుకోవడం.. ఇవన్నీ ఏంటీ? మనమేం పిల్లలం కాదు’’ అని సభ్యులపై మండిపడ్డారు.
క్షమాపణలు చెప్పను: ఖర్గే
భాజపా డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పేందుకు ఖర్గే నిరాకరించారు. పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. ‘‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా?’’ అంటూ భాజపాను ప్రశ్నించారు. అనంతరం పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
Mani Shankar Aiyar: పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే భారత్ దాయాదిని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో హస్తం పార్టీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. -
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దభోల్కర్ (Narendra Dabholkar) హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. -
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన విషయాలు చర్చకు దారితీశాయి. -
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దేశంలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లోని నిందితుల జాబితాలో చేర్చనుంది. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
India-Maldives: కొద్దినెలల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాదని ఆ దేశ విదేశాంగమంత్రి హామీ ఇచ్చారు. -
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు. -
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!