Police Station: లాకప్లో అరగంట అక్రమ నిర్బంధం.. పోలీసులకు రూ.50వేల ఫైన్!
ఓ వ్యక్తిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని, స్టేషన్లో అరగంట పాటు నిర్బంధించినందుకు (illegal detention) రూ.50వేల ఫైన్ను దిల్లీ హైకోర్టు విధించింది.
దిల్లీ: పోలీసులు ఓ వ్యక్తిని అక్రమంగా అదుపులోకి తీసుకొని, స్టేషన్లో నిర్బంధించడంపై (illegal detention) దిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లాకప్లో అరగంటపాటు అక్రమంగా ఉంచినందుకు బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటనతో ప్రమేయమున్న ఇద్దరు పోలీసు అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని పేర్కొన్న న్యాయస్థానం (Delhi High Court).. సామాన్య పౌరుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరిస్తోన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఓ కూరగాయల విక్రేతకు, మహిళకు మధ్య గతేడాది సెప్టెంబర్లో గొడవ జరిగింది. దీనిపై ఫిర్యాదు అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. దాదాపు అరగంట పాటు లాకప్లో బంధించిన అనంతరం అతడిని విడిచిపెట్టారు. అయితే, పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్న బాధితుడు.. తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించినందుకుగానూ పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
ప్రభుత్వ ‘విధానపర నిర్ణయాలను’ అడ్డుకోలేం : సుప్రీం కోర్టు
ఈ కేసును విచారించిన జస్టిస్ సుబ్రమణ్యన్ ప్రసాద్.. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అరెస్టు చేయకుండానే ఘటనాస్థలం నుంచి తీసుకువచ్చి, అకారణంగా లాకప్లో కూర్చోబెట్టారు. అతడు లాకప్లో గడిపిన కాలం తక్కువే అయినప్పటికీ.. పిటిషనర్ స్వేచ్ఛను హరించిన పోలీసులను తీరును సమర్థించలేం. ఈ విషయంలో వారు చట్ట ప్రకారం నడుచుకోలేదు. పోలీసులూ చట్టానికి అతీతులు కాదనే సందేశం వెళ్లాలి. అందుకే పిటిషనర్కు రూ.50 వేల పరిహారం అందించాలి. ఈ మొత్తాన్ని సదరు పోలీసు అధికారుల జీతాల నుంచే చెల్లించాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM