Humsafar Express: హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటలు

శనివారం మధ్యాహ్నం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైల్లో మంటలు చెలరేగాయి. గుజరాత్‌లోని వల్సాడ్ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. 

Published : 23 Sep 2023 16:57 IST

వల్సాడ్‌: గుజరాత్‌(Gujarat)లోని వల్సాడ్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌(Humsafar Express) రైలులో మంటలు చెలరేగాయి. తమిళనాడులోని తిరుచురాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇది వల్సాడ్‌ స్టేషన్ సమీపంలోకి వచ్చిన సమయంలో ఈ  ఘటన చోటుచేసుకుంది. (Fire accident)

రైలుకు చెందిన బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లో మధ్యాహ్నం సమయంలో మంటలు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో పక్క బోగీల్లోని ప్రయాణికులందరినీ వెంటనే దించేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. అంతా సురక్షితంగా ఉన్నారని , మంటలు అదుపులో ఉన్నాయని తెలుస్తోంది. సమాచారం అందడంతో వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని