‘సింగం’ లాంటి పోలీసు చిత్రాలు ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు
న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అభిప్రాయపడ్డారు.
ముంబయి: న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయన్నారు. ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు. ‘కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని ప్రశ్నించారు. ‘సింగం చిత్రం క్లైమాక్స్లో పోలీసులందరూ విలన్ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నేతపై తిరగబడతారు. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే సూత్రమే అందుకు కారణం’’ అని జస్టిస్ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత వైద్యం!
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది. -
తుపాను ధాటికి చెన్నై విలవిల
మిగ్జాం తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. చెన్నైలో గత 24 గంటల్లో 20 సెం.మీ. నుంచి 29 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. -
ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. రోగులకు సేవ
కేరళలోని కన్నూర్ జిల్లా బక్కళం ప్రాంతానికి చెందిన శోభన.. క్యాన్సర్, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచాన పడిన నిరుపేద రోగుల సేవలో తరిస్తున్నారు. క్యాన్సర్ బారినపడిన తన సోదరుడి భార్య అవస్థలను శోభన కళ్లారా చూశారు. -
లారీని ఢీకొని పట్టాలు తప్పిన రైలింజన్
పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలపైకి వచ్చిన ఓ లారీని రాధికాపుర్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో దాని ఇంజిన్ పట్టాలు తప్పి అగ్నికీలల్లో చిక్కుకుంది. -
సంక్షిప్త వార్తలు
జాతుల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన 284 మంది మణిపుర్ విద్యార్థులకు రక్షణగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. వారి చదువుల కొనసాగింపునకు అవకాశం కల్పించింది. -
నేవీ చేతికి భారీ సర్వే నౌక
దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. -
ఐఐటీ కాన్పుర్లో కొలువుల జోష్..
ఐఐటీ-కాన్పుర్లో కొలువుల సందడి మొదలైంది. తొలి రోజు పలు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 485 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్, ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు(పీపీవో) అందుకున్నారు. -
హైకోర్టు జడ్జీల బదిలీలపై కొత్త విధానానికి సిద్ధమే
హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు కొత్త విధానాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సుముఖంగానే ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుపై సోమవారం లోక్సభలో జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. -
రోజుకు సగటున 78 హత్యలు
దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది. -
నేవీలో ర్యాంకుల పేర్లు మారుస్తాం: మోదీ
నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారత నౌకాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. -
తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్టా ఫీస్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. -
నిర్ణయం తీసుకునే ముందే చర్చించాలి
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికపై లోక్సభలో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. -
రెండు ఆరోపణల్లోనూ రాఘవ చడ్డా దోషే
తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించిన అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను రాజ్యసభ హక్కుల కమిటీ దోషిగా నిర్ధారించింది. -
లోక్సభ సీట్ల పంపకంపై తేల్చాలి
లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం అంశాన్ని తేల్చాలని ‘ఇండియా’ కూటమి సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) లేవనెత్తింది. -
తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు
మణిపుర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో సోమవారం రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. -
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.