కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం

మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ చేశారు.

Updated : 23 Jan 2024 14:39 IST

రాజస్థాన్‌ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ

మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన మదన్‌ దిలావర్‌ అనేక ఏళ్ల క్రితం చేసిన ప్రతిజ్ఞను వీడారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం మాలను ధరించి సోమవారం దీక్షను విరమించారు. ఈ సందర్భంగా తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్‌ దిలావర్‌ మరో ప్రతిన బూనారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మథురలో కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తానని చెప్పారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్‌గంజ్‌ మండి సిటీలో జరిగిన ర్యాలీలో దిలావర్‌ డమరుకం వాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని