నామినేషన్ల పర్వం ప్రారంభం
సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్రపతి తరఫున బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది.
తొలి విడతకు నోటిఫికేషన్ జారీ
దిల్లీ: సార్వత్రిక సమరంలో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. తమిళనాడుసహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్రపతి తరఫున బుధవారం ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
- తొలి విడతలోనే తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఆ రాష్ట్రంలో హడావుడి మొదలైంది. ఇప్పటికే పొత్తులను కుదుర్చుకున్న పార్టీలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.
- అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ఈటానగర్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఇక్కడ 60 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను భాజపా ఇప్పటికే ప్రకటించింది. అరుణాచల్ వెస్ట్ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బరిలోకి దిగుతున్నారు. 2019లో 2 లోక్సభ సీట్లను భాజపా గెలుచుకుంది. అసెంబ్లీలో 41 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. జేడీయూ 7, ఎన్పీపీ 5 సీట్లను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 4, పీపీఏ 1 సీటు సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
- అస్సాంలోని కాజీరంగా, సోనిత్పుర్, లఖింపుర్, దిబ్రూగఢ్, జొర్హాట్ నియోజకవర్గాల్లో తొలి విడతలో పోలింగ్ జరగనుంది. తొలి విడతలోని ప్రముఖుల్లో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కాంగ్రెస్ లోక్సభాపక్ష ఉప నేత గౌరవ్ గొగొయ్ తదితరులున్నారు.
- పుదుచ్చేరిలోని లోక్సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి కులోత్తుగన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
- జమ్మూ కశ్మీర్లోని ఉధంపుర్-కథువా లోక్సభ స్థానానికి తొలి విడతలోనే ఎన్నిక జరగనుంది. ఈ సీటుకు ఇప్పటివరకూ భాజపా, గులాం నబీ ఆజాద్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
Prajwal Revanna: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం
రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఉత్తరాఖండ్లోని లక్సర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
నాలుగేళ్లలో అరకోటి వృక్షాలు మాయం
‘వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయ’ని పెద్దల నానుడి! పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికీ ఎంతో అవసరమని ఇటీవలి పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. -
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. -
తనకు బదులు మరొకరిని వైద్య పరీక్షలకు పంపి..
బెయిలు పొడిగింపు పొందేందుకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఓ నిందితుడు తనకు బదులు మరో వ్యక్తిని ఆసుపత్రికి పంపించాడు. చివరి నిమిషంలో ఈడీ అధికారులు అసలు సంగతిని గుర్తించడంతో చివరకు మళ్లీ జైలుకు వెళ్లాడు. -
సభలో అనారోగ్యంతో కుప్పకూలిన వ్యక్తి.. ప్రసంగాన్ని ఆపి చికిత్సకు ఆదేశించిన మమత
పశ్చిమ బెంగాల్లోని బంకుర జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో టీఎంసీ ఛైర్పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. -
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?