ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది.
పశ్చిమ బెంగాల్ సర్కారును ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం
దిల్లీ: సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, భూములను కబ్జా చేయడం వంటి నేరాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఈ నెల 10న కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘‘కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పిటిషనర్గా రావాల్సిన అవసరం ఏం వచ్చింది?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై పశ్చిమబెంగాల్ తరపున హాజరైన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవి సహేతుకం కాదు. ఎందుకంటే.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. హైకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని సర్కారుకు స్పష్టంచేసింది’’ అని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ ఉంటే వాటిని తొలగించాలని హైకోర్టునే ఆశ్రయించవచ్చు కదా అని ప్రశ్నించింది. అనంతరం వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామంటూ విచారణను జులైకి వాయిదా వేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ఈ పిటిషన్పై కొద్దివారాల తర్వాత విచారణ చేపట్టాలని కోరారు. తమ వద్ద చాలా ముఖ్యమైన సమాచారం ఉందని, దాన్ని న్యాయస్థానం ముందు దాఖలు చేస్తామని చెప్పారు. ‘‘మీ విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేస్తున్నాం. అందువల్ల ఈ పిటిషన్ పెండింగ్లో ఉండటాన్ని సాకుగా చూపి.. హైకోర్టులో కేసు విచారణను సాగదీయడానికి ప్రయత్నించకూడదు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో దీదీ సర్కారుకు ఊరట
దిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ వ్యవహారంపై తాము మే 6న విచారణ చేపడతామని తెలిపింది. బెంగాల్లో 2016లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ) ద్వారా చేపట్టిన 25,753 నియామకాలు చెల్లవంటూ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మమత సర్కారు సుప్రీంను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. -
సుశీల్ మోదీ ఇంటికి వెళ్లిన ప్రధాని
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం బిహార్ రాజధాని పట్నా చేరుకొని, నేరుగా భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ ఇంటికి వెళ్లారు. -
‘ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’
వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్ ఎయిర్ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
హేమంత్కు బెయిలిస్తే.. అందరూ అడుగుతారు: సుప్రీంకు తెలిపిన ఈడీ
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. -
పోస్టల్ బ్యాలెట్ అంశంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
పోస్టల్ బ్యాలెట్ జారీ అంశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. -
ఆప్నకు విదేశీ నిధులు అందాయి
ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. -
విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి
భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాధించాలంటే జీడీపీలో (స్థూల జాతీయోత్పత్తిలో) ఆరు శాతం విద్యారంగానికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక ‘వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (విట్) ఛాన్స్లర్ జి.విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. -
ఈవీఎం ఎన్క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్పై త్రయంబకేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ రాతలు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక భాజపా హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్ను బెదిరిస్తూ కొన్ని రాతలు (గ్రాఫిటీ) వెలసిన నేపథ్యంలో ఆప్ ఈ మేరకు స్పందించింది. -
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
దిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్కు ఎక్స్పైరీ తేదీకి దగ్గరగా ఉన్న గోధుమ పిండి ప్యాకెట్ వచ్చింది. దీంతో ఆ సంస్థతో చిన్నపాటి యుద్ధమే నడిపాడు. -
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓ యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేయడం గమనార్హం.