Karnataka: ఉద్యోగులకు ‘ఎన్నికల’ బొనాంజా.. సమ్మె గండం గట్టెక్కిన బొమ్మై సర్కారు
శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటక (Karnataka) సర్కారు సమ్మె (Strike) గండం నుంచి గట్టెక్కింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన బొనాంజా ప్రకటించింది.
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు కర్ణాటక (Karnataka) సర్కారు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మూల వేతనాన్ని 17శాతం పెంచుతూ బుధవారం కీలక ప్రకటన చేసింది. దీంతో పాటు పింఛను విధానంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఉద్యోగులు తమ సమ్మెను విరమించారు.
కర్ణాటక (Karnataka) చరిత్రలో దాదాపు 25 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (strike) బాట పట్టిన విషయం తెలిసిందే. బేసిక్ శాలరీని 40శాతం పెంచడంతో పాటు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలను సవరించాలని, పాత పింఛను విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం ఉద్యోగులంతా సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు (Government employees) ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే, మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) సర్కారుకు ఈ సమ్మె ఓ గండంలా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దిగొచ్చారు. గంటల వ్యవధిలోనే వేతన పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఈ పెంపుతో ఉద్యోగులకు కాస్త ఉపశమనం కల్పించి సమ్మె గండం నుంచి గట్టెక్కారు.
ఈ సందర్భంగా బొమ్మై (Basavaraj Bommai) మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగులందరి వేతనాన్ని 17శాతం పెంచుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇక 7వ వేతన సవరణ సంఘం అమలు గురించి కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించా. ఇక నూతన పింఛను విధానాన్ని అధ్యయనం చేసేందుకు అదనపు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నాం. ఆ కమిటీ రెండు నెలల్లో తమ నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందువల్ల ఉద్యోగులు సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలి’’ అని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు సమ్మె (Strike) విరమించాయి. ఉద్యోగులంతా తక్షణమే తిరిగి విధుల్లో చేరాలని చెప్పినట్లు కర్ణాటక (Karnataka) రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.ఎస్.షడాక్షరి మీడియాకు తెలిపారు.
కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24తో ముగియనుంది. అంతకంటే ముందే ఏప్రిల్లో ఎన్నికలు (Assembly elections) జరిగే అవకాశాలున్నాయి. మార్చి నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక