Mamata Banerjee: అదే జరిగితే ‘ఈసీ’ ఎదుట దీక్ష చేస్తా: దీదీ
కేంద్రంలోని భాజపాకు ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
కోల్కతా: రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్ కార్యాలయం (EC) ఎదుట తాను నిరాహార దీక్ష చేపడతానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హెచ్చరించారు. కేంద్రంలోని భాజపా (BJP)కు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీపుర్దువార్లో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు.
భాజపా ఆదేశాలమేరకు ముర్షిదాబాద్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను ఈసీ తొలగించిందని ఆరోపించారు. ‘‘భాజపా ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోంది. అందుకే ముర్షిదాబాద్ డీఐజీని తొలగించింది. అలర్లు, హింసను ప్రేరేపించేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ముర్షిదాబాద్, మాల్దాలో అలర్లు జరిగినట్లయితే దానికి ఈసీ బాధ్యత వహించాల్సిందే. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్షకు నేను సిద్ధం’’ అని దీదీ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ధన వర్షం.. రోజుకు రూ.100కోట్లు సీజ్!
ఐటీకి సవాల్
జైల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను భాజపా బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘‘మీకు ఎన్ని కారాగారాలు, ఎంతమంది పోలీసులు అనుకూలంగా ఉన్నారో నేనూ చూస్తాను. మీరు ఎంతమందిని బాధించగలరు? నాపై చాలాసార్లు దాడి జరిగింది. ఎలా పోరాడాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు నిర్వహించడంపై ఆమె స్పందించారు. ధైర్యముంటే భాజపా నాయకులు ప్రచారానికి తిరుగుతున్న హెలికాఫ్టర్లలో సోదాలు నిర్వహించగలరా అని ఐటీకి సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM