Indian railways: రైలెక్కేందుకు పోటెత్తిన ప్రయాణికులు.. ఒకరి మృతి!
రైలు ఎక్కేందుకు పెద్దఎత్తున ప్రయాణికులు పోటెత్తిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూరత్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గాంధీనగర్: రైలెక్కేందుకు పెద్దఎత్తున ప్రయాణికులు పోటెత్తడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్లోని సూరత్ రైల్వేస్టేషన్ (Surat Railway Station)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛఠ్ పండగ (Chhath festival) నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకుగానూ పెద్దఎత్తున ప్రయాణికులు శనివారం సూరత్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. దీంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలోనే బిహార్కు వెళ్లే రైలు ప్లాట్ఫాంపైకి చేరుకుంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు యత్నించడంతో.. గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలోనే పలువురు స్పృహతప్పి పడిపోయారు.
రైల్వేస్టేషన్లో విపరీతమైన రద్దీ ఉందని, దీని కారణంగా కొంతమంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. తొక్కిసలాటతో కిందపడిపోయిన ప్రయాణికుల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య తలెత్తిందని, అతడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడిని అంకిత్ వీరేంద్ర సింగ్గా గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్లో పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నం చేశారని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
స్నేహితుడి ముఖంతో వీడియో కాల్.. డీప్ ఫేక్తో నయా మోసం!
సూరత్లోని వజ్ర, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది వలస కార్మికులు ఏటా ఛఠ్ పూజ సమయంలో బిహార్, ఉత్తర్ప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. పండగ సీజన్లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు స్టేషన్లలో రద్దీ నిర్వహణ, భద్రత, అదనపు సిబ్బంది మోహరింపు వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?