MS Swaminathan: ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
MS Swaminathan: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (MS Swaminathan) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గురువారం (సెప్టెంబరు 28) ఉదయం 11 గంటల ప్రాంతంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఆ ఆకలి చావులను చూసి..
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ కూడా తండ్రి బాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్ కరవును కళ్లారా చూసిన ఆయన చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేండ్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి యూజీ డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI)లో పీజీ చదివారు.
పీజీ పూర్తయిన తర్వాత స్వామినాథన్ యూపీఎస్సీ పరీక్ష రాసి ఐపీఎస్కు అర్హత సాధించారు. కానీ, ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో చేరి పీహెచ్డీ పూర్తిచేశారు. కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన.. 1954లో భారత్కు తిరిగొచ్చి IARIలో శాస్త్రవేత్తగా రీసెర్చ్ కొనసాగించారు. 1972-79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
భారత్లో హరిత విప్లవానికి నాంది పలికి..
భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణను ప్రవేశపెట్టి, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడి, సంకర జాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే విధానాలు అనుసరించడం మొదలుపెట్టడాన్ని హరిత విప్లవం (Green Revolution) అంటారు. ఇది తొలిసారి మెక్సికోలో 1945లో ప్రారంభమైంది. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మెక్సికో ప్రభుత్వం వివిధ రకాలైన గోధుమ వంగడాలను అభివృద్ధి చేసింది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ విప్లవాన్ని ఇతర దేశాలను విస్తరించడానికి నిర్ణయించింది.
అదే సమయంలో 1960ల్లో భారత్ తీవ్ర కరవు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్ స్వామినాథన్.. మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ను దేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా ఇబ్బందులున్నప్పటికీ.. మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్లో పండించారు. అవి మంచి దిగుబడి రావడంతో భారత్లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. దీంతో స్వామినాథన్ను భారత హరిత విప్లవ పితామహుడిగా అభివర్ణిస్తారు.
పద్మవిభూషణ్తో సత్కారం..
దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్ విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. 1971లో రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్కు నామినేట్ ఎంపీగా సేవలందించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు.
డబ్ల్యూహెచ్వోలో స్వామినాథన్ కుమార్తె..
స్వామినాథన్కు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో 2019 నుంచి 2022 వరకు చీఫ్ సైంటిస్ట్గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో ఈసారి అత్యధికులు కోటీశ్వరులేనట. 80శాతం ఎమ్మెల్యేలకు రూ.కోటి కంటే ఎక్కువే ఆస్తులున్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. -
Amit Shah: పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్: హోంమంత్రి అమిత్ షా ప్రకటన
Amit Shah: పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని.. అందుకే అక్కడ సీట్లను రిజర్వ్ చేసి పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. -
Arvind Kejriwal: ఆప్ పథకాలనే కాపీ కొడుతున్నారు: కేజ్రీవాల్
ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి దేశంలో కొన్ని పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. -
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి హద్దుదాటి వ్యాఖ్యలు చేశాడు. భారత్లో దాడి చేస్తామంటూ బెదిరించాడు. -
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ.. రాజకీయాలపై ఆయన పరిణతి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఈ విషయాలను ఆయన కుమార్తె తన పుస్తకంలో ప్రస్తావించారు. -
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
డీఏంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ మౌనంగా ఉండటంపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. -
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
Websites: పార్ట్టైం జాబ్ మోసాలు.. 100కి పైగా వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
More than 100 websites blocked: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధించింది. పార్ట్టైం జాబ్ మోసాలు, మోసపూరిత పెట్టుబడులను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. -
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం
అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. -
‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్
ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్ నాయక్ ‘బిలియనీర్ ఫార్మర్’ అవార్డును దక్కించుకున్నారు. -
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రసారాలు నిలిపివేత
కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. -
భూ కక్ష్యలోకి తిరిగొచ్చిన చంద్రయాన్-3 మాడ్యూల్
అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువతచ్చింది. -
‘అపోలో కిడ్నీ రాకెట్’పై విచారణకు కేంద్రం ఆదేశం
దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. -
పౌరసత్వం మంజూరైన అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. -
రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్
పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మనీలాండరింగ్ నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. -
డీప్ఫేక్ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం
తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. -
కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.


తాజా వార్తలు (Latest News)
-
Social Look: శ్రీదేవి డ్రెస్లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్
-
Digital India Act: ఎన్నికల తర్వాతే డిజిటల్ ఇండియా యాక్ట్: రాజీవ్ చంద్రశేఖర్
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
-
Chhattisgarh: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80శాతం కోటీశ్వరులే..
-
Wikipedia: వికీపీడియాలో భారత్ హవా..!
-
Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్కు నిమ్మగడ్డ వినతి