Election Commissioners: ప్రధాని మాటే తుది నిర్ణయమని రుజువవుతోంది : శరద్ పవార్
ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే నూతన విధానాన్ని చూస్తుంటే ప్రధాని మోదీ నిర్ణయించిన ప్రకారం వారి ఎంపిక జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని శరద్ పవార్ పేర్కొన్నారు.
పుణె: కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) ఇద్దరు కమిషనర్ల (Election Commissioners)ను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైందని.. ఇందులో నిర్ణయం ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. ఇదే విషయంపై మాట్లాడిన ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే నూతన విధానాన్ని చూస్తుంటే ప్రధాని మోదీ నిర్ణయించిన ప్రకారం వారి ఎంపిక జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.
గతంలో ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండేవారు. అయినప్పటికీ ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ ప్రక్రియ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తొలగించారు. కొత్త విధానం ప్రకారం, ఇద్దరు కేంద్ర మంత్రులు, విపక్ష నేత కొత్త కమిషనర్లను ఎంపిక చేయాలి. అంటే ప్రధాని నిర్ణయించిన వారినే కమిషనర్లుగా నియమిస్తారు’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. పుణెలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త విధానంలో వారికి నచ్చినట్లే నిర్ణయాలు జరుగుతాయన్నారు.
కమిషన్ జారీ..
కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్లుగా మాజీ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్లు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి గురువారం సాయంత్రం న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలాఉంటే, గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవల రాజీనామా చేయడంతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఇద్దరు కమిషనర్ల నియామకం వేగంగా జరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
దేవెగౌడ కంచుకోట అయిన హసన్ ఎంపీ సెగ్మెంట్ బరిలో ఉన్న ఆయన మనవడు రేవణ్ణ ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకి వచ్చిన వేళ ఈ పరిణామం చోటు చేసుకొంది. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
సోషల్ మీడియా ట్రోలర్ల వికృత రూపం మరోసారి బయటపడింది. పదో తరగతిలో స్టేట్ టాపర్గా నిలిచిన బాలికను వారు వేధించారు. ఒక దశలో కొన్ని మార్కులు తగ్గినా బాగుండు అని ఆమె అనుకొనేలా చేశారు. చివరికి నెటిజన్లు, నాయకులు ఆమెకు అండగా నిలవడంతో ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టిపెడతానని పేర్కొంది. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సాహిల్ ఖాన్కు సిట్ అధికారులు డిసెంబరులోనే సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్