Dwaraka Expressway: ఇంజినీరింగ్ అద్భుతం.. ద్వారకా ఎక్స్ప్రెస్వే డ్రోన్ విజువల్స్
దిల్లీ-హరియాణాల మధ్య ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపై నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్వే (Dwaraka Expressway)ను ఇంజినీరింగ్ అద్భుతం అంటూ వీడియోను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
దిల్లీ: కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ద్వారకా ఎక్స్ప్రెస్వే (Dwaraka Expressway)కు సంబంధించిన డ్రోన్ వీడియోను ఎక్స్ (ప్రస్తుతం ట్విటర్)లో షేర్ చేశారు. ‘‘ద్వారకా ఎక్స్ప్రెస్వే ఇంజినీరింగ్ అద్భుతం.. కళాత్మకమైన నిర్మాణ ప్రతిభతో భవిష్యత్తులోకి ప్రయాణం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇంతకీ ఈ రహదారి ప్రత్యేకతలు ఏంటి? దీన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని ఎందుకంటున్నారో చూద్దాం.
- ద్వారకా ఎక్స్ప్రెస్వేను దిల్లీ (Delhi)లోని ద్వారకా నుంచి హరియాణా (Haryana)లోని గుడ్గావ్ను కలుపుతూ నిర్మించారు. మొత్తం 29 కి.మీ పొడవుతో నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్వేలో 19 కి.మీ హరియాణాలో, మిగిలిన 10 కి.మీ. దిల్లీలో ఉంటుంది. దీని నిర్మాణానికి రూ. 9 వేల కోట్లు ఖర్చైంది.
- ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం వల్ల దిల్లీ-గుడ్గామ్ మధ్య ఉన్న ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపై 50 నుంచి 60 శాతం ట్రాఫిక్ రద్దీతోపాటు వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని గడ్కరీ తెలిపారు. డిసెంబరు 2023 నుంచి ఇది పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
- దీని నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీల్ను ఉపయోగించారు. పారిస్లోని ఈఫిల్ టవర్ (Eiffel Tower)లో ఉపయోగించిన స్టీల్ కంటే ఇది 30 రెట్లు ఎక్కువ. 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించారు. ఇది దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)లో ఉపయోగించిన దానికంటే ఆరు రెట్లు అధికం. నిర్మాణ సమయంలో తొలగించిన సుమారు 1,200 చెట్లను తిరిగి మరోచోటులో నాటారు.
- దిల్లీ-గుడ్గావ్ ఎక్స్ప్రెస్వేలోని శివ్-మూర్తి వద్ద ప్రారంభమై దిల్లీ సెక్టార్ 21లోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది. దేశంలోనే తొలి ఎనిమిది లైన్ల ఎక్స్ప్రెస్వే. ఇందులో 3.6 కి.మీ పొడవు, ఎనిమిది లైన్ల అండర్ టన్నెల్ రోడ్డును నిర్మించారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్తోపాటు, అండర్పాస్ల యాక్సెస్ కోసం వేర్వేరు ఇంటర్ఛేంజ్లను ఏర్పాటు చేశారు.
- ఈ ఎక్స్ప్రెస్వేలో ఆధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థతోపాటు, టోల్ మేనేజ్మెంట్, నిరంతర పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ద్వారకా నుంచి మనేసర్కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. మనేసర్ నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాలు, మనేసర్ నుంచి సింఘు బోర్డర్కు 45 నిమిషాల్లో ప్రయాణించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. -
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు