Pakistan-China: పిలిస్తే రాలేదు.. సొంత చర్చలు పెట్టారు!
అఫ్గానిస్థాన్ విషయంలో చైనా, పాకిస్థాన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాలిబన్ ఆక్రమణ తర్వాత అఫ్గాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత్ నిర్వహించిన ‘ప్రాంతీయ భద్రత చర్చ’లకు చైనా, పాక్ హాజరుకాని విషయం తెలిసిందే. అయితే, గురువారం పాక్ ప్రభుత్వం
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ విషయంలో చైనా, పాకిస్థాన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాలిబన్ ఆక్రమణ తర్వాత అఫ్గాన్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత్ నిర్వహించిన ‘ప్రాంతీయ భద్రత చర్చ’లకు చైనా, పాక్ హాజరుకాని విషయం తెలిసిందే. అయితే, గురువారం పాక్ ప్రభుత్వం అఫ్గాన్ పరిస్థితులపై ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో రష్యాతోపాటు చైనా పాల్గొనడం గమనార్హం. ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలు.. అఫ్గాన్ ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చాయి. ఇదే సమయంలో అక్కడి ప్రజల మానవ హక్కులను కూడా తాలిబన్లు గౌరవించాలని కోరాయి.
అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్కడ పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని కట్టడి చేయాల్సిన అవసరముందని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఆసియా దేశాలు దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్పై చర్చల కోసం మొదట రష్యా సమావేశం నిర్వహించింది. దీనికి అమెరికా హాజరుకాలేదు. బుధవారం భారత ప్రభుత్వం ఉన్నతస్థాయి చర్చలు జరిపింది. ఆసియా దేశాలన్నింటికి ఆహ్వానం పంపగా.. పాక్, చైనాలు ఈ చర్చలకు డుమ్మా కొట్టాయి. పాకిస్థాన్ కారణం చెప్పకుండానే చర్చలకు రాలేమని తేల్చి చెప్పగా.. చైనా మాత్రం షెడ్యూల్ కుదరకపోవడం వల్ల రాలేకపోతున్నామని సాకు చూపింది. కానీ, మరుసటి రోజు పాక్ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైంది.
ఇస్లామాబాద్లో గురువారం జరిగిన సమావేశం సందర్భంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ అఫ్గాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే.. ఆ దేశంతోపాటు పొరుగు దేశాలు కూడా అస్థిరతకు గురవుతాయని అన్నారు. అఫ్గాన్లో శాంతి, స్థిరత్వం తీసుకురావడానికి సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ చర్చించాయని వెల్లడించారు. ఇలాంటి చర్చల్లో అఫ్గాన్ ప్రతినిధులు కూడా ఉండాలని పాక్ సూచించింది. అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమింటే.. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి ఇస్లామాబాద్లోనే ఉన్నారు. కానీ, చర్చల్లో పాల్గొనకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్