Hacking Row: ‘హ్యాక్ అలర్ట్’ దుమారం.. యాపిల్కు పార్లమెంట్ కమిటీ సమన్లు..?
Hacking Attempt alert Row: హ్యాకింగ్ అలర్ట్ వ్యవహారంపై యాపిల్ (Apple) ప్రతినిధులకు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
దిల్లీ: దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం ‘హ్యాక్ అలర్ట్ (Hacking Attempt alert)’ మెసేజ్లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆ సందేశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ హ్యాక్ అలర్ట్ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. దీనిపై వివరణ కోరుతూ యాపిల్ (Apple) సంస్థకు సమన్లు జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఐటీశాఖ (IT)పై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం (Parliamentary Standing Committee ).. రాబోయే సమావేశంలో ఈ ‘హ్యాక్ అలర్ట్’ అంశంపై చర్చించనుందని ఈ కమిటీ సెక్రటేరియట్ ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిందని తెలిపాయి. ఈ వ్యవహారంపై యాపిల్ ప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని కమిటీ యోచిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తమ యాపిల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగిందని మంగళవారం పలువురు విపక్ష నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమ ఐఫోన్లకు అలర్ట్ సందేశాలు వచ్చాయని వారు వెల్లడించారు. దీంతో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ.. హ్యాకింగ్ ప్రయత్నం జరిగినట్లు వ్యక్తమైన అనుమానాలపై నిగ్గు తేల్చేందుకు ‘కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని వెల్లడించింది.
అటు యాపిల్ కూడా దీనిపై స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమని పేర్కొంది. ఒక్కోసారి యాపిల్ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు అయి ఉండొచ్చు అని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.