Farmers Protest: ‘రైతు సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని చర్చించాలి’
Farmers Potest: రైతు సమస్యల పరిష్కారానికి చర్చలు జరపనున్న కేంద్ర మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ మాట్లాడాలని రైతు నేతలు కోరారు.
దిల్లీ/చండీగఢ్: తమ డిమాండ్ల ఆమోదం కోసం ఆందోళన చేస్తున్న రైతులతో (Farmers Protest) కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ (PM Modi) చర్చించాలని రైతు సంఘాల నాయకులు కోరారు. గురువారం శంభు సరిహద్దు ప్రాంతంలో ‘కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ’ ప్రధాన కార్యదర్శి శర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు అనుమతించాలన్నారు. పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో రైతులపై పారామిలటరీ బలగాలు బాష్ప వాయుగోళాలు ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. ‘‘ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపాలని చూస్తోంది. అందుకే ఈ ప్రాంతంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మా డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తేలేదు’’ అని తెలిపారు.
పంటకు కనీస మద్దతు ధర (MSP)తో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని ‘దిల్లీ చలో’కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్ నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా, వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేసింది. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు బాష్ప వాయుగోళాలు, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. గురువారం సాయంత్రం ఐదు గంటలకు చండీగఢ్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో సమావేశం కానున్నారు.
మరోవైపు ‘దిల్లీ చలో’ చేపట్టిన రైతులకు మద్దతుగా ‘భారతీయ కిసాన్ యూనియన్’ పంజాబ్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు వరకు రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దాంతోపాటు టోల్ ప్లాజాల వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిరసన చేపట్టాలని ‘సంయుక్త కిసాన్ మోర్చా’ కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.