Global Hunger Index: పాక్ కంటే భారత్ పరిస్థితే ఆందోళన కలిగిస్తోంది..!
ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్ఐ)లో భారత్ స్థానం మరింత కిందకు పడిపోయింది. 2020లో వెలువరించిన సూచికలో 94వ స్థానంలో ఉన్న మనదేశం.. 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాల జాబితాలో మన స్థానమది. పొరుగున ఉన్న నేపాల్(76), బంగ్లాదేశ్(76), మయన్మార్(71), పాకిస్థాన్(92) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది.
ప్రపంచ ఆకలి సూచికలో 101 వ స్థానానికి పడిపోయిన భారత్
దిల్లీ: ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్ఐ)లో భారత్ స్థానం మరింత కిందకు పడిపోయింది. 2020లో వెలువరించిన సూచికలో 94వ స్థానంలో ఉన్న మనదేశం.. 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాల జాబితాలో మన స్థానమది. పొరుగున ఉన్న నేపాల్(76), బంగ్లాదేశ్(76), మయన్మార్(71), పాకిస్థాన్(92) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంది. ఈ దేశాలు కూడా ఆందోళన కలిగించే విభాగంలోనే ఉన్నప్పటికీ తమ దేశంలోని పౌరులకు ఆహారం అందించడంలో భారత్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఐర్లాండ్కు చెందిన Concern Worldwide, జర్మనీకి చెందిన Welt Hunger Hilfe సంయుక్తంగా ఈ ఆకలి సూచికకు సంబంధించిన నివేదికను తయారు చేశాయి. భారత్లో ఆహార స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాయి.
భారత్ జీహెచ్ఐ స్కోరు 2000లో 38.8 గా ఉండగా.. 2012-2021 మధ్యలో 28.8 నుంచి 27.5కి పడిపోయింది. పోషకాహార లేమి, చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఐదేళ్ల లోపు పిల్లల్లో వారి వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఆ వయసు వారిలో మరణాలు.. ఈ సూచికల ఆధారంగా జీహెచ్ఐ స్కోరును గణిస్తారు. కొవిడ్-19, మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది చిన్నపిల్లల్లో పోషకాహార లేమికి దారితీసింది. ఆ విషయంలో భారత్ ముందు వరుసలో ఉందని పేర్కొంది. అయితే ఆ సూచికల్లో భారత్ కాస్త మెరుగవుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆకలికి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటం దారి తప్పిందని, 47 దేశాలు 2030నాటికి తక్కువ ఆకలి స్థాయుల్ని సాధించలేవని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నివేదికను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
‘పేదరికం, ఆకలి, భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా, డిజిటల్ ఎకానమీగా మార్చడం.. వంటి వాటిని నిర్మూలించినందుకు మోదీకి అభినందనలు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 2020లో 94 వ స్థానంలో ఉంది. 2021లో అది 101వ స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ కంటే భారత్ వెనుకబడి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్ పంపి విద్యార్థి అదృశ్యం
విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్లోని కోటాలో మరో ఘటన చోటుచేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. -
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
జనాభాలో హిందువుల వాటా తగ్గుదల
భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. -
‘తట్టు’కొనేదెలా?
భారత్లో తట్టు టీకా పొందడానికి అర్హులైన చిన్నారుల్లో దాదాపు 12 శాతం మంది.. నిర్దేశిత రెండు డోసుల్లో కనీసం ఒక్క డోసు కూడా పొందని వారు దాదాపు 12 శాతం మంది ఉన్నారని తాజా అధ్యయనం పేర్కొంది. -
తెల్లకాగితాలపై సంతకాలు చేయించి.. అత్యాచారం కేసులు పెట్టారు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ మహిళలపై అకృత్యాల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. -
మరో ఆర్నెల్లు.. వీసా లేకుండా చలో థాయిలాండ్
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త.. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. -
సీసీటీవీ ఫుటేజీ చూపిన బెంగాల్ గవర్నర్
రాజ్భవన్ సిబ్బందిలోని ఓ మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ సాధారణ పౌరులకు ఈ నెల రెండో తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని చూపించారు. -
అశ్లీల చిత్రాల కేసు సమీక్షకు.. కింది కోర్టుకే వెళ్లమన్న హైకోర్టు
సంబంధిత వ్యక్తుల అంగీకారం లేకుండా ప్రచురించిన అసభ్య దృశ్యాలను తొలగించాలని మైక్రోసాఫ్ట్, గూగుల్ సెర్చింజన్లకు గతేడాది ఏప్రిల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల సమీక్షకు అదే కోర్టుకు వెళ్లాలని దిల్లీ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. -
పరస్పర ప్రయోజనాల ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. -
అదానీ, అంబానీలపై దర్యాప్తునకు ఆదేశించండి
పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ (సీపీఐ) కోరారు. -
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం కోర్టును కోరింది. -
కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. -
నేడు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. -
డాక్యుమెంట్లపై అసంతృప్తి.. భారతీయులను తిరిగి దుబాయ్కు పంపిన జమైకా
జమైకాలో పర్యటించేందుకు వెళ్లిన కొందరు భారతీయులకు చుక్కెదురైంది. దుబాయ్ నుంచి ఛార్టర్డ్ విమానంలో జమైకా రాజధాని కింగ్స్టన్ను చేరుకున్న భారతీయుల డాక్యుమెంట్లను పరిశీలించిన స్థానిక అధికారులు తృప్తి చెందక పోవడంతో వారిని తిరిగి పంపించారు. -
కిక్కిరిసిపోతున్న కారాగారాలకు బహిరంగ జైళ్లే పరిష్కారం: సుప్రీం కోర్టు
దేశంలో కిక్కిరిసిపోతున్న కారాగారాల సమస్యల పరిష్కారానికి బహిరంగ జైళ్లే పరిష్కారమని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. -
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
పదో తరగతి ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు అదరగొట్టేశారు.. ఓ బాలిక ఏకంగా 625/625 మార్కులు సాధించగా.. ఏడుగురు విద్యార్థులు 624 మార్కులతో సత్తా చాటారు.