హతవిధి.. ట్రంప్ పరిస్థితి..!
చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే ఉంది.
ఇంటర్నెట్డెస్క్: చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే ఉంది. అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా దిగజారిపోయింది. సన్నిహితులు కూడా ఆయనకు దూరం పాటిస్తున్నారు. మరోవైపు ఆయనపై అభిశంసన మొదలైంది. ఈ సమయంలో ట్విటర్, ఫేస్బుక్, గూగుల్తో పాటు పలు సామాజిక మాధ్యమాలు ఆయన ఖాతాలను తొలగించడమో.. లేదా తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తున్నాయి. అందరితోపాటు తాను కూడా ఓ చెయ్యేసి.. ట్రంప్పై కసి తీర్చుకోవాలని టిక్టాక్ కూడా నిశ్చయించుకొంది. ట్రంప్కేమో టిక్టాక్లో ఖాతా లేదు. దీంతో ట్రంప్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను తొలగిస్తున్నట్లు టిక్టాక్ ప్రకటించింది. దీంతోపాటు #stopthesteal వంటి హ్యాష్ట్యాగ్లను తొలగిస్తోంది. ‘‘విద్వేషపూరిత ప్రవర్తన, హింసకు టిక్టాక్లో స్థానం లేదు. ఏ ఖాతాలైన హింసను గొప్పగా చూపించినా, ప్రచారం చేసినా మా సామాజిక నిబంధనలను ఉల్లంఘించినట్లే. వాటిని తొలగిస్తాం’’ అని టిక్టాక్ ప్రకటించింది.
ఆగస్టు నుంచి ట్రంప్ కార్యనిర్వాహక వర్గం టిక్టాక్ను నిషేధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్రంప్ ఒక సారి టిక్టాక్ను నియంత్రిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా జారీ చేశారు. అమెరికా జాతీయ భద్రతను కారణంగా చూపించి ఆయన ఈ చర్యలకు ఉపక్రమించారు. దీంతో అక్టోబర్, డిసెంబరులలో ట్రంప్ ఆదేశాలను న్యాయస్థానంలో టిక్టాక్, దాని కంటెట్ క్రియేటర్లు సవాల్ చేశారు. ఈ కేసులు విచారించిన ఫెడరల్ జడ్జిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు ఆదేశాలను జారీ చేశారు. వీటిపై డిసెంబర్ చివర్లో ట్రంప్ అప్పీలుకు వెళ్లారు. మరోవైపు టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించేలా దాని మాతృసంస్థ బైట్డ్యాన్స్పై డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఒత్తిడి తెస్తోంది. దీనికి సంబంధి డిసెంబర్ 4 తుది గడువు. ఇది దాటిపోయి చాలాకాలం అయినా.. అమెరికాలో టిక్టాక్ పనిచేస్తోంది.
ట్రంప్ యూట్యూబ్ ఛానల్పై ఆంక్షలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆంక్షల చట్రంలోకి వచ్చింది. ఆయన పోస్టు చేసిన కొన్ని వీడియోలను తొలగించే పనిలో యూట్యూబ్ ఉంది. క్యాపిటల్ భవనంపై దాడి చేసిన దుండగులను ‘వెరీ స్పెషల్’ అంటూ ట్రంప్ పొగిడిన వీడియోను ఇప్పటికే యూట్యూబ్ తొలగించింది. ఆ తర్వాత వీడియోలు పోస్టు చేయడంపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ నేడు మాత్రం యూట్యూబ్ మరో ప్రకటన జారీ చేసింది. ‘‘సమీక్ష తర్వాత మా పాలసీకి విరుద్ధంగా ఉన్న వీడియోలను ట్రంప్ ఛానల్ నుంచి తొలగించాము’’ అని ప్రకటించింది. నేడు అప్లోడ్ చేసిన కొన్ని వీడియోల తొలగింపునకు కచ్చితమైన కారణం వెల్లడించలేదు. కొన్ని మాత్రం ఛానల్లో ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ట్రంప్ ఛానల్ ఒక స్ట్రైక్ను ఎదుర్కోవడంతో మరో వారం పాటు కొత్త వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం లేదు. దీంతోపాటు ఆ ఛానల్లో వీడియోలపై కామెంట్లు చేయడానికి కూడా వీల్లేదు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
హరియాణాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
భారత్ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లో 25వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భారత సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. -
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
Karnataka Sex Tape Row: ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారంపై తన బాబాయ్ కుమారస్వామి స్పందిస్తూ కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
Supreme Court: పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న ఉపాధ్యాయ నియామక కుంభకోణం.. వ్యవస్థీకృత మోసం అని సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈసందర్భంగా దీదీ సర్కారుకు చురకలంటించింది. -
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా పడిన ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని ముస్లిం సోదరీమణులు భావించారని ప్రధాని మోదీ(Modi) వెల్లడించారు. -
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్ఐఆర్ (CSIR) తన సిబ్బందిని కోరింది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
Arvind Kejriwal: మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. ఆయన సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, దీనిపై ప్రస్తుతానికి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
Jharkhand: ఝార్ఖండ్లో బయటపడిన నోట్ల గుట్టల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రితం నాటి రూ.10వేల లంచం కేసులో తీగ లాగితే కరెన్సీ కొండలు కన్పించాయి. -
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి