MK Stalin: ప్రధాన భాషగా హిందీ.. అమిత్షా వ్యాఖ్యలపై మండిపడ్డ స్టాలిన్
హిందీని ప్రధాన భాషగా ఎంపిక విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తమిళనాడు సీఎం స్టాలిన్ ఖండించారు.
చెన్నై: ప్రధాన భాషగా హిందీని ఎంపిక చేసే విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మేం ఎప్పటికీ హిందీ భాషకు బానిసలం కాబోము’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాన భాష ఎంపిక అంశంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ 38వ సమావేశంలో శుక్రవారం అమిత్ షా మాట్లాడుతూ.. విపక్షాలు అడ్డుపడుతున్నా.. హిందీని ప్రధాన భాషగా అంగీకరించాల్సిందేనని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. హిందీకి ఇతర భాషలేవీ పోటీ కాదని, అన్ని భారతీయ భాషలను ప్రోత్సహించడం ద్వారానే దేశం సాధికారత సాధిస్తుందని అమిత్షా కూడా సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.
దీనిపై స్టాలిన్ స్పందిస్తూ.. ‘‘అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది హిందీయేతర భాషలు మాట్లాడేవారిని లొంగదీసుకునే ప్రయత్నమే. హిందీ ఆధిపత్యాన్ని తమిళనాడు తిరస్కరిస్తుంది. మన భాష, వారసత్వమే మనల్ని నిర్వచిస్తుంది. హిందీ బాషను అనుకరించి మేం బానిసలుగా మారబోం’’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ అంశంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘‘ హిందీని బలవంతంగా రుద్దడంపై కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమిత్ షాజీ... ఈ ప్రతిఘటనను గమనించండి. తమిళనాడులో 1965 నాటి హిందీ వ్యతిరేక ఆందోళలను మళ్లీ తీసుకురావొద్దు’’ అని స్టాలిన్ అన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలంటూ అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీని, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషను అమలు చేయాలని, అలాగే ఇంగ్లిష్ను ఐచ్ఛికం చేయాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా నివేదిక సమర్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. -
పాక్ వ్యక్తిని అప్పగించిన బీఎస్ఎఫ్
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. -
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
పొరుగుదేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని.. అందుకే చైనాతో సానుకూల చర్చలు కొనసాగిస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్