LS Polls: 20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు.
కోహిమా: సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) తొలి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. బెంగాల్, మణిపుర్లలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. అయితే, నాగాలాండ్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో ‘సున్నా శాతం’ పోలింగ్ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది తొమ్మిది గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు.
20 మంది ఎమ్మెల్యేలూ దూరం..
నాగాలాండ్లో ఆరు జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. రాష్ట్రంలో మొత్తం 13.25 లక్షల ఓటర్లు ఉండగా.. ఈ ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఉన్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించినప్పటికీ.. ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకురాలేదు. 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు హక్కును వినియోగించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రత్యేక రాష్ట్రం కోసం..
ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. ఏడు గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO)గా ఏర్పడి తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఎన్నోఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యిందని చెబుతోన్న ఈఎన్పీవో.. ఏప్రిల్ 18 సాయంత్రం నుంచే నిరవధిక బంద్ పాటించాలని ఇటీవల ప్రకటించింది. దీంతో పోలింగ్ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు, అత్యవసర సేవలు మినహా రోడ్లపై ఏ ఒక్క వ్యక్తి, వాహనం కనిపించలేదు. అయినప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణమే నెలకొందని అధికారులు వెల్లడించారు.
మా చేతుల్లో లేదు : సీఎం
తాజా పరిణామంపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో స్పందించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని.. ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటరీ (FNT) స్వయంప్రతిపత్తి కల్పించాలని ఇప్పటికే సిఫార్సు చేశామన్నారు. అయితే, 20 మంది ఎమ్మెల్యేలూ ఓటు వేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాము ఘర్షణ కోరుకోవడం లేదని సీఎం రియో స్పష్టంచేశారు.
ఎన్నికల వేళ బంద్కు పిలుపునివ్వడాన్ని నాగాలాండ్ ఎన్నికల అధికారులు తప్పుపట్టారు. ఈఎన్పీవోకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి (CEO) వయసన్ ఆర్ పేర్కొన్నారు. దీనిపై ఈఎన్పీవో అధ్యక్షుడు సపికియు సంగ్తం స్పందిస్తూ.. నోటీసుల్లో ఈసీ పేర్కొన్న సెక్షన్ ఈసందర్భంలో వర్తించదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. బ్రిజ్భూషణ్ స్థానంలో కుమారుడికి టికెట్
BJP: లోక్సభ ఎన్నికలకు భాజపా మరో విడత జాబితా విడుదలైంది. ఎంపీ బ్రిజ్భూషణ్ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో అభ్యర్థిని ప్రకటించింది. -
రాహుల్ను ప్రధానిని చేయాలని పాక్ తహతహ: మోదీ ధ్వజం
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ను దేశ ప్రధానిని చేయాలని దాయాది పాకిస్థాన్ తహతహలాడుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్-పాక్ బంధం బయటపడిందని అన్నారు. -
ఆ కుంభకోణం గురించి పార్టీకి ముందే తెలుసు: టీఎంసీ మాజీ నేత సంచలన ఆరోపణలు
తృణమూల్ కాంగ్రెస్కు ఎన్నికల ముందు మరో పెద్దషాక్ తగిలింది. మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఓ కీలక నేత తీవ్ర ఆరోపణలు చేశాడు. ఉద్యోగ నియామక కుంభకోణం పార్టీకి 2021లోనే తెలుసని తెలిపారు. -
బ్రిజ్ భూషణ్కు టికెట్ కట్..!
ఉత్తరప్రదేశ్ బాహుబలి నేతల్లో ఒకరైన బ్రిజ్భూషణ్కు ఈ సారి భాజపా టికెట్ కట్ చేసినట్లు తెలుస్తోంది. -
తెలంగాణ, అస్సాంలలో భాజపా రహస్య ఒప్పందాలు: ప్రియాంక
అస్సాంలో మాఫియా రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
ఓటమి భయంతో హుందాతనాన్ని మరచిన మోదీ
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమికి ఓటమి అనివార్యమని తేలిపోవడంతో ప్రధాని మోదీ నిరాశా నిస్పృహలకు లోనై ఆ పదవి హుందాతనాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. -
రిజర్వేషన్లపై 50% కోటా పరిమితి ఎత్తివేస్తారా?
లోక్సభ ఎన్నికల ఘట్టంలో ఇంకా అయిదు విడతలు మిగిలి ఉండగా, రిజర్వేషన్ల కోటాపై ప్రధాన పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆ అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. -
ఎవరూ భయపడటం లేదు.. అమేఠీ, రాయ్బరేలీపై నేడు నిర్ణయం: కాంగ్రెస్
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది 24 నుంచి 30 గంటల్లో ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. -
గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రొటోకాల్
గుర్తుల లోడింగ్ యూనిట్ల (ఎస్ఎల్యూ) నిర్వహణ, నిల్వకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) నూతన ప్రొటోకాల్ను తీసుకొచ్చింది. -
ప్రజాక్షేత్రంలో శివసేనలకు పరీక్ష
శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి. -
‘మత’ రిజర్వేషన్ల ఉద్దేశం లేదని లిఖిత గ్యారంటీ ఇవ్వగలరా?
కాంగ్రెస్ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు. -
వారణాసిలో మోదీపై మిమిక్రీ కళాకారుడి పోటీ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ శ్యామ్ రంగీలా(29) ప్రకటించారు. -
భాజపాలో చేరిన నటి రూపాలి గంగూలీ, జోతిష్యుడు అమేయా జోషీ
ప్రముఖ బుల్లితెర నటి రూపాలి గంగూలీ, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త, జోతిష్యుడు అమేయా జోషీ భాజపాలో చేరారు. -
సంక్షిప్త వార్తలు (7)
దిల్లీలో ఆప్తో పొత్తు కాంగ్రెస్లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సమన్లు
రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించి నకిలీ వీడియోను వ్యాప్తి చేసిన కేసులో దిల్లీ పోలీసులు ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్కు సమన్లు జారీ చేశారు. -
20 ఏళ్ల తర్వాత పోటీ.. దిల్లీలో కీలక పదవిపై కన్ను..!
శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఆయన ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు. -
‘టీఎంసీ’ కంటే ‘భాజపా’కు ఓటేయడమే ఉత్తమం - కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్
తృణమూల్ (TMC) కంటే భాజపాకు ఓటు వేయడం ‘ఉత్తమం’ అని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించడంపై టీఎంసీ మండిపడింది. -
మహాత్మాగాంధీ కోరికను ప్రజలు నెరవేర్చనున్నారు: రాజ్నాథ్ సింగ్
మహాత్మాగాంధీ ఆశయాన్ని దేశ ప్రజలు నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల నుంచి తుడిచిపెడతారని భాజపా నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అన్నారు. -
అక్కడ పోటీకి రాహుల్, ప్రియాంక ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..? కారణాలేంటి..?
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. -
వారణాసిలో మే 13న మోదీ నామినేషన్..!
PM Modi: ప్రధాని మోదీ ఈనెల 13న వారణాసిలో నామినేషన్లో వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భాజపా వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్