మేఘన సీమంతంలో చిరు..!

ఇటీవల ఆకస్మికంగా కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘన శ్రీమంతం వేడుక సోమవారం జరిగింది. అయితే చిరు నిల్చున్నట్లు ఉన్న ఓ కటౌట్‌ని తయారు చేయించి.. శ్రీమంతం వేడుకలో మేఘన పక్కనే ఉంచారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన..

Published : 05 Oct 2020 15:27 IST

భావోద్వేగానికి గురైన అభిమానులు

బెంగళూరు: ఇటీవల ఆకస్మికంగా కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక సోమవారం జరిగింది. అయితే చిరు నిల్చున్నట్లు ఉన్న ఓ కటౌట్‌ని తయారు చేయించి.. ఈ వేడుకలో మేఘన పక్కనే ఉంచారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వేడుకలో భాగంగా తన భర్త చిత్రపటంతో తీసుకున్న ఓ అపురూపమైన ఫొటోని షేర్‌ చేసిన మేఘన.. ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపై ఎప్పటికీ కూడా జరుగుతుంది. ఐ లవ్‌ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మరోవైపు ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి సర్‌ కటౌట్‌ చూస్తుంటే‌.. ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మేఘనా రాజ్‌ - చిరంజీవి సర్జా.. ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాది జూన్‌ నెలలో గుండెపోటు రావడంతో చిరు మృతిచెందిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని