నితిన్‌ చిత్రానికి ఆసక్తికర టైటిల్‌

యువ కథానాయకుడు నితిన్‌ జోరుమీదున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు

Updated : 01 Oct 2020 19:46 IST

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ జోరుమీదున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘రంగ్‌దే’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్‌-టైటిల్‌ను స్టార్‌ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘చెక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రీలుక్‌లో నితిన్‌ చేతికి సంకెళ్లు ఉండగా, టేబుల్‌పై చదరంగం పావులు, కంచె ఉన్నాయి. మరి ఈ చదరంగం ఆటలో ఎవరు ఎలాంటి పావులు కదిపారు? ఎవరు చెక్‌మేట్‌ చెప్పారు? వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్‌ పెడతారో చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు రకుల్, ప్రియా వారియర్‌ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతరవిశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని