Tollywood: మాస్ నాడి పట్టి..బాలీవుడ్ని వెనక్కి నెట్టి
బాలీవుడ్ అంటే చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ పెద్దన్నలా ఉండేది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించేది. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినిమాలకు మంచి రీచ్ ఉండటంతో భారీ వసూళ్లు దక్కేవి. ప్రాంతీయ భాషా చిత్రాల పరిధి కొంతవరకే ఉండేది. దక్షిణాది చిత్రాలంటే కాస్త చిన్నచూపు అనే విమర్శ కొనసాగేది. ‘
బాలీవుడ్ అంటే చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ పెద్దన్నలా ఉండేది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించేది. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినిమాలకు మంచి రీచ్ ఉండటంతో భారీ వసూళ్లు దక్కేవి. ప్రాంతీయ భాషా చిత్రాల పరిధి కొంతవరకే ఉండేది. దక్షిణాది చిత్రాలంటే కాస్త చిన్నచూపు అనే విమర్శ కొనసాగేది. ‘బాహుబలి’తో బాలీవుడ్కే కాదు ప్రపంచ సినిమాకు దక్షిణాది సినిమా సత్తా ఏంటో తెలిసింది. క్రమంగా బాలీవుడ్ను దాటి ముందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దక్షిణాది సినిమా. ‘పుష్ప’ దక్షిణాదిలో ఎంత హిట్ అయ్యిందో అంతే గొప్పగా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. అక్కడే రూ.100కోట్లు పైనే వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి మన మాస్ మంత్రమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాల తర్వాత దక్షిణాది భారీ చిత్రాలన్నీ పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ భారీ విజయంతో ఈ వేగం రెట్టింపైంది. అదే సమయంలో బాలీవుడ్లో ఒకప్పటి వేగం కనిపించడం లేదంటున్నారు సినీ విమర్శకులు. బాలీవుడ్ స్థానాన్ని దక్షిణాది చిత్రాలు ఆక్రమించడం మొదలైంది అంటున్నారు. కరోనా మొదలయ్యాకా ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలైనా వావ్ అనిపించేలా సత్తా చాట లేదు. ఇదే సమయంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమ భారీ విజయాలు అందుకుంది. ‘‘దక్షిణాది చిత్రాలు హిందీ చిత్రాలను దాటేస్తున్నాయి. బాలీవుడ్తో పోలిస్తే దక్షిణాది సినిమాల శాటిలైట్ హక్కులూ భారీ ధర పలుకుతున్నాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్లు అదే స్థాయిలో ఉంటున్నాయి’’అంటున్నారు ‘పుష్ప’ హిందీ హక్కులు దక్కించుకున్న మనీష్షా.
బాలీవుడ్ ఎందుకిలా!
బాలీవుడ్ నుంచి భారీ సినిమా వస్తుందంటే ఇతర అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అంచనాలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. భారీ బాలీవుడ్ చిత్రాలు మూస దారిలో వెళుతున్నాయి. కథలో కొత్తదనం ఉండటం లేదు, ఎక్కువమందికి చేరువయ్యే కథలు రావడం లేదు...ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్పై సర్వసాధారణమయ్యాయి. తాజాగా అజిత్తో ‘వలిమై’ చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘దక్షిణాది సినిమాల్లో యాక్షన్, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయి’’ అంటున్నారు.
అంచనాల పాన్ ఇండియా
దక్షిణాది భాషల్లోని అగ్ర హీరోల చిత్రాలన్నీ పాన్ ఇండియా బాట పట్టడానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘కేజీఎఫ్ 2’, ‘లైగర్’ ఇలా పలు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి మరిన్ని విజయాలు దక్కితే అటు ఇటు కావడం ఖాయమనే మాటలూ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ను దాటి దక్షిణాది సినిమాలు దూసుకుపోవడం తథ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే జరిగితే ఎక్కువ లాభపడేది మన తెలుగు పరిశ్రమే.
మాస్ని ఆకట్టుకోవడంలో విఫలం
‘‘కొన్ని ఏళ్లుగా బాలీవుడ్లో ఎక్కువ శాతం మందికి చేరువయ్యే సినిమాలు రావడం లేదు. సల్మాన్ఖాన్, అజయ్దేవ్గణ్, ఆమిర్ఖాన్ లాంటి పెద్ద హీరోల చిత్రాలూ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకే పరిమతం అయ్యేలా ఉంటున్నాయి. రాజ్కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి వారి పరిధి కొంత వరకే ఉంటుంది. అంతేకానీ రూ.300కోట్లు వసూళ్లు సాధించే పరిస్థితి లేదు. అందుకే మాస్ నాడి పట్టుకున్న ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసుని గెలిచేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ