Adipurush: క్షమాపణలు కోరిన ‘ఆదిపురుష్‌’ రచయిత

‘ఆదిపురుష్‌’ చిత్రం విడుదలకు ముందు నుంచీ ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వచ్చింది. విడుదల తర్వాత అవి రెట్టింపయ్యాయి.

Updated : 09 Jul 2023 14:08 IST

‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం విడుదలకు ముందు నుంచీ ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వచ్చింది. విడుదల తర్వాత అవి రెట్టింపయ్యాయి. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మనోజ్‌ ముంతాషీర్‌ శుక్లా రాసిన  డైలాగులు కూడా విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలైనా కొన్ని రోజులకు వాటిని సవరించానని ఆయన తెలిపారు. అలాంటి డైలాగులు రాసి, ప్రజల మనసులను గాయపరిచినందుకు హృదయాపూర్వక క్షమాపణలు చెప్తూ..‘మీ భావోద్వేగాలను కించపరిచేలా డైలాగులను రాసినందుకు క్షమించండి. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల మాటల వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. బజరంగ్‌ భళి ఎప్పుడు మనల్ని ఐక్యంగా ఉండేలా చూస్తాడు. మన దేశానికి గొప్ప సేవ చేయడానికి ఆయన మనకు శక్తిని ప్రసాదిస్తాడు’ అంటూ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని