Bigg Boss Telugu 5: ఇంత వరకూ బిగ్బాస్లో కెప్టెన్ అవ్వని వారు ఎవరంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-5’. ఇప్పటికే 59 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో సరదా సరదాగా సాగిపోతోంది.
హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్బాస్ సీజన్-5’. ఇప్పటికే 59 రోజులు పూర్తి చేసుకున్న ఈ షో సరదా సరదాగా సాగిపోతోంది. సెప్టెంబరు 5న మొదలైన షోలో మొత్తం 19మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇప్పటివరకూ సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేత, ప్రియ, లోబోలు ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్లో ఇంకా 11మంది సభ్యులు ఉన్నారు.
ఇప్పటివరకూ కెప్టెన్లు అయింది వీరే!
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ‘సూపర్ హీరోస్ vs సూపర్ విలన్స్’ అంటూ ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. కెప్టెన్సీ పోటీదారులకు బిగ్బాస్ స్పెషల్ టాస్క్లు ఇచ్చాడు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుడిలో నెలకొంది. ఎందుకంటే షో మొదలై దాదాపు 60 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకూ అసలు కెప్టెన్ కాని సభ్యులు కూడా హౌస్లో ఉన్నారు. సిరి మొదటి వారమే కెప్టెన్ కాగా, రేషన్ మేనేజర్గా విశ్వ వ్యవహరించాడు. ఆ తర్వాత వరుసగా విశ్వ, జస్వంత్, శ్రీరామచంద్ర, ప్రియ, విశ్వ, సన్నీ, షణ్ముఖ్లు కెప్టెన్లు అయ్యారు. వీరిలో విశ్వ రెండుసార్లు కెప్టెన్ కావడం గమనార్హం.
వీళ్లలో ఎవరైనా అవుతారా?
ఇక హౌస్లో ఉన్న వాళ్లలో రవి, మానస్, ప్రియాంక, అనీ మాస్టర్, కాజల్ కెప్టెన్సీ పోటీదారులుగా తుది వరకూ పోరాడినా వీరిని అదృష్టం వరించలేదు. ఈ వారం వీరిలో ఎవరైనా కెప్టెన్ అవుతారా? లేక ఇప్పటికే అయిన వాళ్ల నుంచి కెప్టెన్గా ఎంపికవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. కెప్టెన్ అయిన వారికి ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. తదుపరి వారం వారిని నామినేట్ చేసే వీలుండదు. దీంతో ఇంటి సభ్యులు కెప్టెన్సీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. గెలిచేందుకు ఎవరి స్ట్రాటజీలు వాళ్లు ఉపయోగిస్తారు. ఇక మాటల యుద్ధం సరేసరి. ‘గ్రూపులుగా ఆడినంతకాలం నేను హౌస్ ఉండగా కెప్టెన్ అవ్వను’ అంటూ అనీ మాస్టర్ ఇటీవల వాయిపోయింది. గతవారం మానస్ కూడా కెప్టెన్ కావాల్సింది. థర్మాకోల్ బాల్స్ టాస్క్లో శ్రీరామ్చంద్రతో పోటీ పడి మానస్ గేమ్ తప్పుకొన్నాడు. ఈ రోజు ఆడే గేమ్ను బట్టి ఇంటి కెప్టెన్ ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో బట్టి చూస్తే, శ్రీరామ చంద్ర, రవిలు ప్రత్యేక టాస్క్లు తీసుకున్నారు. ఇద్దరూ గట్టి పోటీదారులే. వీరితో పాటు ఇంకెవరైనా పోటీలో ఉన్నారా? లేదా తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకూ వరెస్ట్ పెర్ఫార్మర్స్ వీరే!
మరోవైపు కెప్టెన్సీ టాస్క్ పూర్తి కాగానే, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉంటుంది. ఆపై వరెస్ట్ పెర్ఫార్మర్ను ఎంచుకుంటారు. ఇప్పటివరకూ 8మంది వరెస్ట్ పెర్ఫార్మర్స్గా ఎంపికయ్యారు. రెండు సార్లు, జెస్సీ, సన్నీలు ఎంపికవడం విశేషం. వీరు కాకుండా మానస్, కాజల్, శ్వేత, విశ్వలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ