ఎస్పీ బాలుకి కన్నీటి నివాళి 

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు...

Updated : 26 Sep 2020 12:26 IST

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరై బాలు పార్థీవదేహానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, విజయ్‌, దేవిశ్రీ ప్రసాద్‌, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. 

ఈసందర్భంగా మనో బాలు పార్థీవదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించేందుకు తామరైపాక్కంలో 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులతో వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నట్టు తిరువళ్లూరు ఎస్పీ తెలిపారు. కాసేపట్లో తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలోనే బాలు అత్యక్రియలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని