Anasuya: ‘దర్జా’ కథేంటి?

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్‌ మాలిక్‌ తెర కెక్కిస్తున్న చిత్రం ‘దర్జా’. శివశంకర్‌  పైడిపాటి నిర్మాత. ఆమని, పృథ్వీ,  అక్సాఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు   ఇటీవల విడుదల చేశారు.

Updated : 31 Mar 2022 14:19 IST

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్‌ మాలిక్‌ తెర కెక్కిస్తున్న చిత్రం ‘దర్జా’. శివశంకర్‌  పైడిపాటి నిర్మాత. ఆమని, పృథ్వీ,  అక్సాఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత డి.సురేష్‌బాబు   ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చాలా బాగుంది. సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని అనిపిస్తోంది. మంచి విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విభిన్నమైన ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందింది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, భూమాల శ్రీరామ్‌ మూర్తి, షమ్ము, అరుణ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని