D50: సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన హీరో.. సోషల్ మీడియా వేదికగా వెల్లడి

దర్శకుడిగా తన రెండో చిత్రాన్ని పూర్తి చేశారు ధనుష్‌ (Dhanush). కేవలం నాలుగు నెలల్లోనే దీన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

Published : 15 Dec 2023 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోగానే కాకుండా దర్శకుడిగా, సింగర్‌గా ఆకట్టుకుంటున్నారు ధనుష్‌ (Dhanush). ఆరేళ్ల క్రితం ‘పవర్‌ పాండి’ అనే సినిమాతో ఆయన దర్శకత్వం కూడా చేపట్టారు. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించారు. ‘D50’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. తాజాగా దీని షూటింగ్ పూర్తయినట్లు తెలిపారు. 

హీరోగా ధనుష్‌కు ఇది 50వ (D50) సినిమా కాగా.. దర్శకుడిగా రెండోది. ఈ ఏడాది జనవరిలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. జులైలో షూటింగ్‌ ప్రారంభమైనట్లు పోస్ట్‌ పెట్టారు. నేడు ఈ సినిమా పూర్తయినట్లు వెల్లడించారు. ‘ఈ సినిమాకు సహకరించిన నటీనటులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతోనే దీన్ని ఇంత తర్వగా పూర్తిచేయగలిగాం’ అంటూ నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో అభిమానులు అతడికి ఆల్ ది బెస్ట్‌ చెబుతున్నారు. ఇంత సైలెంట్‌గా సినిమా మొత్తం ఎలా పూర్తి చేశావంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

ఇక ఈ ఏడాది ‘సార్’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్న ధనుష్‌.. ప్రస్తుతం తన 50వ చిత్రంతో పాటు ‘కెప్టెన్‌ మిల్లర్‌’(Captain Miller)లో నటిస్తున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం అలరించనుంది. 1980కాలం నాటి కథల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని